Breaking News Live Telugu Updates: గవర్నర్ తమిళిసై లక్ష్మణ రేఖ దాటుతున్నారు - సీసీఐ నారాయణ విమర్శలు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 09 Jun 2022 11:16 AM

Background

ఉపరితల ఆవర్తనం, పశ్చిమ గాలుల ప్రభావంతో నైరుతి రుతుపవనాల కదలికలకు అడ్డంకి ఏర్పడింది. ఈ సంవత్సరం మే 28వ తేదీన రుతుపవనాలు కేరళను తాకాయి. మే 31 నాటికి కర్ణాటక, ఏపీ సరిహద్దు వరకు వచ్చినా.. మధ్యప్రదేశ్, విదర్భ, తెలంగాణ మీదుగా...More

CPI Narayana: గవర్నర్ పై సీసీఐ నారాయణ విమర్శలు

తెలంగాణ గవర్నర్‌ తమిళిసైపై (Tamilisai Sounderarajan) తీరుపై సీపీఐ ప్రధాన కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ గవర్నర్ లక్ష్మణ రేఖను దాటుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ రోజు రాజ్ భవన్ లో మహిళల దర్బార్ ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. రాజకీయ కార్యకలాపాలకు రాజ్ భవన్‌ను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ఒకవైపు బీజేపీ తెలంగాణపై రాజకీయ దాడి పెంచిందని, మరోవైపు గవర్నర్ పాత్ర అగ్నికి అజ్యం పోస్తున్నట్లుగా ఉందని అన్నారు. 


జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ గురించి మాట్లాడుతూ.. మైనర్లను పబ్‌లోకి అనుమతించడం చట్టరీత్యా నేరమని అన్నారు. పబ్‌ను సీజ్‌ చేసి యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని నారాయణ డిమాండ్ చేశారు.