Breaking News Live Telugu Updates: తెలంగాణలో మరోసారి పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 08 Jun 2022 09:53 PM

Background

ఉపరితల ఆవర్తనం, పశ్చిమ గాలుల ప్రభావంతో నైరుతి రుతుపవనాల కదలికలకు అవరోధం ఏర్పడింది. ఈ సంవత్సరం మే 28వ తేదీన రుతుపవనాలు కేరళను తాకాయి. మే 31 నాటికి కర్ణాటక, ఏపీ సరిహద్దు వరకు వచ్చినా.. మధ్యప్రదేశ్, విదర్భ, తెలంగాణ మీదుగా...More

తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీల మోత- ఈ సారి డీజిల్ సెస్ పేరుతో బాదుడు

తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. డీజీల్ సెస్ పేరుతో ఛార్జీలు పెంచేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఇప్పటికే రౌండప్ లు, ప్యాసింజర్ సెస్, టోల్ ప్లాజా సెస్ ల పేరుతో ఛార్జీలు పెంచిన ఆర్టీసి.. ఈసారి డీజిల్ సెస్్ పేరుతో వడ్డనకు సిద్ధమైంది. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సులో ప్రయాణికుడి నుంచి రెండు రూపాయలు వసూలు చేయనుంది. మిగతా సర్వీసుల్లో ఒక్కో ప్రయాణికుడి నుంచి ఐదు రూపాయల వరకు వసూలు చేయడానికి ప్రణాళికి రెడీ చేసింది.