Breaking News Live Telugu Updates: ఎమ్మెల్యేల ఎర కేసు, బీఎస్ సంతోష్, జగ్గుస్వామికి హైకోర్టులో ఊరట
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
ABP Desam Last Updated: 05 Dec 2022 04:13 PM
Background
Weather Latest Update: ఆంధ్రప్రదేశ్ కు తుపాను ముప్పు పొంచి ఉంది. దక్షిణ పసిఫిక్ లో ఏర్పడిన ఉపరితల ఆవర్తన సుమత్రా దీవులకు దగ్గర ఉంది. ఈ ఆవర్తనం బంగాళాఖాతం మీదుగా తమిళనాడు, శ్రీలంక వైపు కదులుతోందని వాతావరణశాఖ తెలిపింది. ఈ...More
Weather Latest Update: ఆంధ్రప్రదేశ్ కు తుపాను ముప్పు పొంచి ఉంది. దక్షిణ పసిఫిక్ లో ఏర్పడిన ఉపరితల ఆవర్తన సుమత్రా దీవులకు దగ్గర ఉంది. ఈ ఆవర్తనం బంగాళాఖాతం మీదుగా తమిళనాడు, శ్రీలంక వైపు కదులుతోందని వాతావరణశాఖ తెలిపింది. ఈ ఆవర్తనం డిసెంబర్ 5వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ఉపరితల ఆవర్తనం వాయుగుండంగా, ఆ తర్వాత తుపానుగా మారే సూచనలు కనిపిస్తున్నట్టు తెలిపింది. ఈ తుపాను ప్రభావం తమిళనాడుపై ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఈ తుపాను వల్ల ఏపీలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో మరికొద్ది రోజుల్లో స్వల్ప వర్ష సూచన అవకాశాలు కనిపిస్తున్నట్లుగా వాతావరణ అధికారులు అంచనా వేశారు. మాండస్ తుపాను బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ తీరంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, 5న అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది మరింత బలం పుంజుకుని వాయుగుండంగా ఆ తర్వాత తుపానుగా మారుతుందని చెప్పారు. 8న తమిళనాడు, ఉత్తర శ్రీలంకల మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ తుపానుకు మాండస్ గా నామకరణం చేశారు. దీంతో ఉత్తర భారతం మీదుగా వీస్తున్న చలిగాలులు తగ్గుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సీజన్లోని బలమైన తుపాను డిసెంబర్ రెండో వారంలో బంగాళాఖాతంలో ఏర్పడనుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు కూడా నిర్థారించారు. అయితే ప్రస్తుతానికి ఏపీకి తుపాను ముప్పు అంతగా లేదంటున్నారు. ఈ వాతావరణ పరిస్థితుల్లో దక్షిణ కోస్తాలో డిసెంబరు ఆరు, ఏడు తేదీల్లో స్వల్ప వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. నెల్లూరు, తిరుపతి, రాయలసీమ జిల్లాలు, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. విజయవాడ, విశాఖల్లో పొడి వాతావరణం ఉంటుందని వెల్లడించారు. Gold-Silver Price 04 December 2022: నిన్నటితో (శనివారం) పోలిస్తే బంగారం ధర (Today's Gold Rate) ఇవాళ (ఆదివారం) కూడా పెరిగింది. 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం ₹ 200, స్వచ్ఛమైన పసిడి ₹ 220 చొప్పున పైకి చేరాయి. కిలో వెండి ధర ₹ 900 పెరిగింది. తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)హైదరాబాద్ (Gold Rate in Hyderabad) మార్కెట్లో 10 గ్రాముల (తులం) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 49,450 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ₹ 53,950 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో ₹ 71,600 కు చేరింది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.ఆంధ్రప్రదేశ్లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)విజయవాడలో (Gold Rate in Vijayawada) 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 49,450 కి చేరింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ₹ 53,950 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 71,600 కు చేరింది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్లో బంగారం, వెండికి విజయవాడ మార్కెట్ రేటే అమలవుతోంది. దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities) చెన్నైలో (Gold Rate in Chennai) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ₹ 50,160 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 54,720 కి చేరింది.ముంబయిలో (Gold Rate in Mumbai) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 49,450 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 53,950 కి చేరింది.దిల్లీలో (Gold Rate in Delhi) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 49,600 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 54,100 గా నమోదైంది.బెంగళూరులో (Gold Rate in Bangalore) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 49,500 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 54,000 గా ఉంది. మైసూరులో (Gold Rate in Mysore) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 49,500 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 54,000 గా ఉంది. పుణెలో (Gold Rate in Pune) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 49,450 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 53,950 గా ఉంది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ఎమ్మెల్యేల ఎర కేసు, బీఎస్ సంతోష్, జగ్గుస్వామికి హైకోర్టులో ఊరట
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. బీఎల్ సంతోష్ నోటీసులపై హైకోర్టు స్టే పొడిగించింది. ఈ నెల 13 వరకు హైకోర్టు స్టే పొడిగించింది. జగ్గుస్వామి నోటీసులపై కూడా హైకోర్టు స్టే విధించింది. కేసు తదుపరి విచారణను 13వ తేదీకి వాయిదా వేసింది.