Breaking News Live Telugu Updates: బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌పై ఎటాక్ - మందడంలో తీవ్ర ఉద్రిక్తత !

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 31 Mar 2023 03:32 PM

Background

ద్రోణి నేడు ఉత్తర మధ్యప్రదేశ్ మధ్య భాగాల నుంచి ఈరోజు ఉత్తర చత్తీస్‌ఘడ్ నుంచి విదర్భ, మరఠ్వాడ, ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతూ ఉందని హైదరాబాద్‌లోని...More

TSPSC పేపర్ లీకేజీ పై ఈడీకి రేవంత్ రెడ్డి ఫిర్యాదు

TSPSC పేపర్ లీకేజీ పై ఈడీకి ఫిర్యాదు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇతర నేతలు.


@ఈడీ కార్యాలయం


టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కామెంట్స్


టీఎస్పీఎస్సీ దొంగలకు, దోపీడీదారులకు, అవినీతిపరులకు అడ్డాగా మారింది.


పరీక్షల నిర్వహణలోఆశ్రిత పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు.


లక్షలాది మంది ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు.


వందలాది మంది నిరుద్యోగులు ప్రాణాలు కోల్పోయినా కల్వకుంట్ల కుటుంబానికి చీమ కుట్టినట్లు కూడా లేదు.


కేసుతో లింక్ ఉన్న ప్రభుత్వ పెద్దలను అమరవీరుల స్థూపం ముందు ఉరేసినా తప్పులేదు.


ఇంత జరిగినా నిరుద్యోగులకు కేటీఆర్ క్షమాపణ చెప్పి పారదర్శక విచారణ చేయిస్తారనుకున్నాం


కానీ సిట్ తో కేసులు వేయించి మా విద్యార్థి నాయకులను నిర్బంధించడం సిగ్గుచేటు


పేపర్ లీకేజ్ లో నేరమే శంకరలక్ష్మి దగ్గర నుంచి మొదలైంది.


ఏ1 గా శంకర లక్ష్మిని, ఏ2గా చైర్మన్, సెక్రెటరీలను పెట్టాలి



కేసులో కావాల్సిన వారిని కాపాడి చిన్న ఉద్యోగులను బలిచేసే ప్రయత్నం చేస్తున్నారు.


ఈ అంశంపై మేం ఇప్పటికే కోర్టును ఆశ్రయించాం


 కోర్టులో కేసు విచారణ జరుగుతోంది.


ఈడీ జాయింట్ డైరెక్టర్ ను కలిసి పిర్యాదు చేశాం


420, 120బీ సెక్షన్లు ఈడీ పరిధిలోకి వస్తాయి.


కేటీఆర్ తో సహా టీఎస్పీఎస్సీ అధికారులందరినీ విచారించాలని కోరాం


సిట్ కొద్ది మందినే విచారిస్తుందని మాకు సమాచారం ఉంది.


పూర్తి సమాచారం సేకరించి విచారణ చేయాలని ఈడీ అధికారులను కోరాం.


జగిత్యాల జిల్లాలో పరీక్ష రాసిన వారి సమాచారం కేటీఆర్ కు అందించిన వారు ఎవరు.


కటాఫ్ మార్కుల గురించి పరీక్ష రాసిన అభ్యర్థులకె తెలియదు.


కేటీఆర్ కు ఈ విషయాలు ఎలా తెలిశాయి?


పారదర్శక విచారణ చేసి చర్యలు తీసుకుంటామని ఈడీ అధికారులు హామీ ఇచ్చారు.


పరువున్న వారు పరువు నష్టం దావా వేస్తారు.


కేటీఆర్ తెలంగాణ పరువును 


నిజంగా కేటీఆర్ కు పరువు ఉంటే సీబీఐ, ఈడీ అధికారులతో పారదర్శక విచారణకు అదేశాలివ్వాలి


లేకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని లేఖ రాయాలి.


కేటీఆర్ పరువు 100కోట్లు అని ఎలా నిర్ణయిస్తారు?


విద్యార్థులు, నిరుద్యోగుల ఉసురు తీయొద్దు..


వాళ్ల ఉసురు తగిలితే సర్వనాశనం అయిపోతారు.


ఈ కేసులో ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తి లేదు