Breaking News Live Telugu Updates: ఓయూ లో ఉద్రిక్తత, పెట్రోల్ పోసుకొని కానిస్టేబుల్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
ABP Desam Last Updated: 30 Aug 2022 07:57 PM
Background
Rains in Telangana AP: ఉపరితల ఆవర్తనం దక్షిణ కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. దక్షిణ బంగాళాఖాతంలో నుంచి ఏపీ దక్షిణ ప్రాంతం వరకు...More
Rains in Telangana AP: ఉపరితల ఆవర్తనం దక్షిణ కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. దక్షిణ బంగాళాఖాతంలో నుంచి ఏపీ దక్షిణ ప్రాంతం వరకు 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఇది క్రమంగా దక్షిణవైపు కదులుతోంది. ఉత్తర కర్ణాటక నుంచి కొమోరిస్ ప్రాంతం వరకు, దక్షిణ కర్ణాటక మరియు తమిళనాడు మీదుగా ఉన్న సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. వీటి ఫలితంగా ఏపీ, తెలంగాణ, యానాంలో ఆగస్టు 31 వరకు వర్షాలు కురవనున్నాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ కేంద్రం. తెలంగాణలో ఆ జిల్లాల్లో భారీ వర్షాలురాష్ట్రంలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆగస్టు 29న మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, జనగాం, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసింది.నేడు (ఆగస్టు 30న) నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, యాదాద్రి భువనగరిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, రంగారెడ్డి మెదక్, కామారెడ్డి, వనపర్తి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలలో అక్కడక్కడ వర్ష సూచన ఉంటడంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. హైదరాబాద్ నగరంలో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. వాయువ్యం, ఉత్తర దిశల నుంచి గాలులు గంటకు 4 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి.ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ ప్రాంతాల్లో నేటి నుంచి మరో రెండు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో తేలికపాటి జల్లులు కురవనున్నాయి. ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం పడుతుంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..దక్షిణ కోస్తాంధ్రకు మోస్తరు వర్ష సూచన ఉండగా.. రాయలసీమ జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంత్రం తెలిపింది. చిత్తూరు, అనంపురం జిల్లాల్లో మరో రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో తేలికపాటి జల్లులు పడతాయని అధికారులు అంచనా వేశారు. 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచనున్నాయి.బంగారం, వెండి ధరలుదేశవ్యాప్తంగా బంగారం ధర (Today's Gold Rate) నిన్నటితో పోలిస్తే నేడు కాస్త తగ్గింది. 10 గ్రాములకు దాదాపు రూ.150 తగ్గింది. కిలో వెండి ధర కూడా నేడు రూ.800 తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ మార్పులు కనిపించాయి. తెలంగాణలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Telangana)22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర ఇవాళ హైదరాబాద్ (Gold Rate in Hyderabad) మార్కెట్లో రూ.47,150 గా ఉంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం రూ.51,430 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో నేడు రూ.60,000 గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhra Pradesh)విజయవాడలో పసిడి ధర (Gold Rate in Vijayawada) ఇలా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.47,150 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.51,430 గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.60,000 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,150 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,430 గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.60,000 గా ఉంది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ఓయూలో ఉద్రిక్తత, పెట్రోల్ పోసుకొని కానిస్టేబుల్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం
ఓయూలో ఉద్రిక్తత నెలకొంది. పెట్రోల్ పోసుకొని కానిస్టేబుల్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఓసీ, బీసీ అభ్యర్థులకు కానిస్టేబుల్, ఎస్సై రాత పరీక్షల్లో పాస్ పర్సంటేజ్ తగ్గించడంపై అభ్యర్థుల ఆందోళన చేపట్టారు. ఎస్టీ, ఎస్సీలకు కూడా క్వాలిఫై మార్కులు తగ్గించాలని అభ్యర్థుల డిమాండ్ చేస్తున్నారు. క్వాలిఫై మార్కులు తగ్గించాలంటూ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కళాశాల వద్దకు ర్యాలీ నిర్వహించారు.