Breaking News Live Telugu Updates: రాష్ట్రానికి కాపు సీఎం కావొచ్చు- మాజీ మంత్రి పేర్ని నాని
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
ABP Desam Last Updated: 27 Dec 2022 05:59 PM
Background
శ్రీలంక సమీపాన నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం నైరుతి దిశగా కదులుతున్నందున సోమవారం దక్షిణ కోస్తా తమిళనాడు, దక్షిణ కేరళలో భారీ వర్షాలు కురిశాయి. నేడు కూడా ఆ ప్రాంతాల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం...More
శ్రీలంక సమీపాన నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం నైరుతి దిశగా కదులుతున్నందున సోమవారం దక్షిణ కోస్తా తమిళనాడు, దక్షిణ కేరళలో భారీ వర్షాలు కురిశాయి. నేడు కూడా ఆ ప్రాంతాల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు.మరోవైపు, దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో చలిగాలులు పెరిగాయి. రాజధాని ఢిల్లీతో పాటు హరియాణా, చండీఘడ్, అమృతసర్ ప్రాంతాల్లో సోమవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు దట్టమైన పొగమంచు కమ్ముకుంటుందని భారత వాతావరణ విభాగం హెచ్చరిక చేసింది. ఢిల్లీలో సోమవారం ఉదయం కనిష్ఠ ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెల్షియస్ అని నమోదైంది.పంజాబ్, హరియాణా - చండీగఢ్ - ఢిల్లీ, ఉత్తర రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో చలి గాలులు తీవ్రంగా ఉన్నాయి. రాబోయే రెండు రోజుల్లో రాజస్థాన్ లోని సౌరాష్ట్ర, కచ్ మీదుగా చలిగాలుల పరిస్థితులు కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.‘‘నేడు అక్కడక్కడ మాత్రమే, కొద్ది పాటి వర్షాలను చూడగలము. నిన్న శ్రీలంక మీదుగా ఉన్న అల్పపీడనం నేడు హిందూ మహాసముద్రం వైపుగా వెళ్లింది. దీని వలన మనం నేడు కొద్దిసేపు వర్షాలు, ఎండ మారుతూ ఉండడాన్ని గమనించవచ్చు. దక్షిణ ఆంధ్ర జిల్లాలైన నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు అలాగే సత్యసాయి జిల్లాల్లో ఇలాంటి వాతావరణం చూడగలం. కడప జిల్లాలోని పలు భాగాల్లో కూడా వర్షాలు ఉంటాయి. రేపటికి ఈ వర్షాలు మరింత తగ్గుముఖం పట్టనుంది.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.శ్రీలంక సమీపాన నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం నైరుతి దిశగా కదులుతున్నందున సోమవారం దక్షిణ కోస్తా తమిళనాడు, దక్షిణ కేరళలో భారీ వర్షాలు కురిశాయి. నేడు కూడా ఆ ప్రాంతాల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు.మరోవైపు, దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో చలిగాలులు పెరిగాయి. రాజధాని ఢిల్లీతో పాటు హరియాణా, చండీఘడ్, అమృతసర్ ప్రాంతాల్లో సోమవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు దట్టమైన పొగమంచు కమ్ముకుంటుందని భారత వాతావరణ విభాగం హెచ్చరిక చేసింది. ఢిల్లీలో సోమవారం ఉదయం కనిష్ఠ ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెల్షియస్ అని నమోదైంది.పంజాబ్, హరియాణా - చండీగఢ్ - ఢిల్లీ, ఉత్తర రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో చలి గాలులు తీవ్రంగా ఉన్నాయి. రాబోయే రెండు రోజుల్లో రాజస్థాన్ లోని సౌరాష్ట్ర, కచ్ మీదుగా చలిగాలుల పరిస్థితులు కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.‘‘నేడు అక్కడక్కడ మాత్రమే, కొద్ది పాటి వర్షాలను చూడగలము. నిన్న శ్రీలంక మీదుగా ఉన్న అల్పపీడనం నేడు హిందూ మహాసముద్రం వైపుగా వెళ్లింది. దీని వలన మనం నేడు కొద్దిసేపు వర్షాలు, ఎండ మారుతూ ఉండడాన్ని గమనించవచ్చు. దక్షిణ ఆంధ్ర జిల్లాలైన నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు అలాగే సత్యసాయి జిల్లాల్లో ఇలాంటి వాతావరణం చూడగలం. కడప జిల్లాలోని పలు భాగాల్లో కూడా వర్షాలు ఉంటాయి. రేపటికి ఈ వర్షాలు మరింత తగ్గుముఖం పట్టనుంది.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఇలా ఉన్నాయి:తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)హైదరాబాద్ (Gold Rate in Hyderabad) మార్కెట్లో 10 గ్రాముల (తులం) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 49,950 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ₹ 54,480 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో ₹ 74,000 కు చేరింది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.ఆంధ్రప్రదేశ్లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)విజయవాడలో (Gold Rate in Vijayawada) 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 49,950 కి చేరింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ₹ 54,480 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 74,000 కు చేరింది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్లో బంగారం, వెండికి విజయవాడ మార్కెట్ రేటే అమలవుతోంది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
రాష్ట్రానికి కాపు సీఎం కావొచ్చు- మాజీ మంత్రి పేర్ని నాని
మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి కాపు సీఎం కావొచ్చన్నారు. హరిరామ జోగయ్య దీక్షను స్వాగతిస్తున్నామన్నారు. సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తి వచ్చినప్పుడు కాపు సీఎం కావొచ్చన్నారు.