బీజేపీ వరంగల్ సభకు హైకోర్టు అనుమతి
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
ABP Desam Last Updated: 26 Aug 2022 04:48 PM
Background
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చి వాయుగుండంగా మారింది. క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. వాయవ్య బంగాళాఖాతంపై ఏర్పడిన తుపాను వాయుగుండం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్,...More
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చి వాయుగుండంగా మారింది. క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. వాయవ్య బంగాళాఖాతంపై ఏర్పడిన తుపాను వాయుగుండం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, యానాంలో నేటి నుంచి మూడు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలో ఆగస్టు 30 వరకు కొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ కావడంతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తెలంగాణలో ఆ జిల్లాల్లో భారీ వర్షాలుతీవ్ర వాయుగుండం ప్రభావం తెలంగాణపై కొనసాగుతూనే ఉంది. వికారాబాద్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నల్గొండ సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్ జిల్లాల్లో గురువారం ఓ మోస్తరు వర్షం కురిసింది. నేడు సైతం కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆగస్టు 30 వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వికారాబాద్, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి జోగులాంబ గద్వాల జిల్లాల్లో మరికొన్ని గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఈ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది. రాష్ట్రంలో గాలులు గంటకు 6 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి..ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఆగస్టు 28 వరకు తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్లుండి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు.దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి ఏపీలోని రాయలసీమపై ప్రభావం చూపుతోంది. నేడు రాయలసీమ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఆగస్టు 27, 28 తేదీల్లోనూ రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆగస్టు 28 వరకు రాయలసీమ ప్రాంతానికి ఎల్లో అలర్ట్ జారీ చేసి, అక్కడి ప్రజలను అప్రమత్తం చేశారు.హెచ్చరిక: భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. అరటితోటలకు నష్టం వాటిల్లుతుంది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు నష్టం జరుగుతుందన్నారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.బంగారం, వెండి ధరలుతెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (Todays Gold Rate) నిన్నటితో పోలిస్తే నేడు మరింత పెరిగింది. 10 గ్రాములకు ఏకంగా రూ.250 పెరిగింది. వెండి ధర కూడా నేడు కిలోకు రూ.200 పెరిగింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ (Hyderabad Gold Rate) మార్కెట్లో రూ.47,500 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.51,820 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో నేడు రూ.61,100 గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)Gold Rates Today విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,500 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,820గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.61,100 గా ఉంది. విజయవాడలో పసిడి ధర ఇలా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.47,500 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.51,820 గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.61,100 గా ఉంది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
బీజేపీ వరంగల్ సభకు హైకోర్టు అనుమతి
వరంగల్ బీజేపీ సభకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండిసంజయ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా రేపు హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో బీజేపీ భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా హాజరుకానున్నారు.