= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
క్రిస్మస్ తర్వాత దేశవ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు క్రిస్మస్ తర్వాత దేశవ్యాప్తంగా ఊపందుకోనున్న బిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు
• అధినేత సూచనలతో పలు రాష్ట్రాల్లో ఇప్పటికే క్రేత్రస్థాయిలో ప్రారంభానికి సిద్దమైన బి ఆర్ కె ఎస్
• డిసెంబర్ నెలాఖరు కెల్లా 6 రాష్ట్రాల్లో ప్రారంభం కానున్న భారత రాష్ట్ర కిసాన్ సమితి ( బిఆర్ఎస్ కిసాన్ సెల్)
• మహారాష్ట్ర, కర్నాటక, ఒడిసా సహా పలు రాష్ట్రాల్లో ఎగరనున్న బిఆర్ఎస్ జెండాలు
• దేశవ్యాప్తంగా బిఆర్ఎస్ భావజాల వ్యాప్తి కోసం పలు భాషల్లో పాటలు, సాహిత్యం సిద్దం.
• కన్నడ, మరాఠా,ఒడిస్సా సహా పలు భారతీయ భాషల సాహిత్య కారులు, పాటల రచయితలకు ఈ దిశగా సూచనలిస్తున్న బిఆర్ఎస్ అధినేత సిఎం కెసిఆర్
• బిఆర్ఎస్ లో చేరేందుకు పలు రాష్ట్రాలు సహా ఆంధ్రప్రదేశ్ నుంచి భారీ ఎత్తున సంప్రదింపులు...మద్దతు
• ఇప్పటికే ఢిల్లీలో సంప్రదింపులు జరిపిన పలువురు ప్రముఖులు సంస్థలు
• డిసెంబర్ నెలాఖరులో ఢిల్లీలో జాతీయ మీడియా సమావేశం నిర్వహించనున్న బిఆర్ఎస్ అధినేత సిఎం కెసిఆర్..
• బిఆర్ఎస్ విధి విధానాలు ప్రకటన
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ తో పంజాబ్ సీఎం భగవంత్ భేటీ సీఎం కేసీఆర్ తో భేటీ అయిన పంజాబ్ సీఎం భగవంత్
ప్రగతి భవన్ కు చేరుకున్న పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్....
పలు జాతీయ అంశాలు దేశ రాజకీయాల పై సిఎం కెసిఆర్ తో కొనసాగుతున్న చర్చలు..
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Nellore Road Accident: నెల్లూరు జిల్లాలో కార్మికులపైకి దూసుకెళ్లిన లారీ.. నలుగురు మృతి నెల్లూరు జిల్లాలో రోడ్డు నిర్మాణ కార్మికులపైకి దూసుకెళ్లిన లారీ.. నలుగురు మృతి
గుడ్లూరు మండలం మోచర్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది
మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
కిడ్నాప్ కాదు, ప్రేమించిన వాడితో వెళ్లిపోయాను: సిరిసిల్ల యువతి క్లారిటీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ యువతిని కిడ్నాప్ చేసిన ఘటన లో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. చందుర్తి మండలంలోని మూడపల్లి గ్రామానికి చెందిన చంద్రయ్య అనే వ్యక్తి తన కూతురుతో కలిసి ఈ రోజు (డిసెంబరు 20) తెల్లవారుజామున గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో పూజలు చేసుకుని తిరిగి వస్తున్న సమయంలో యువతిని కిడ్నాప్ చేశారు. అయితే తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, జానీ, తాను నాలుగేళ్లుగా ప్రేమించుకుంటామని యువతి వెల్లడించింది. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని, ఈ పని చేశానంటూ పెళ్లి దుస్తుల్లో వీడియో పోస్ట్ చేసింది. దాంతో ఇది కిడ్నాప్ వ్యవహారం కాదని, ప్రేమ వివాదమని అర్థమవుతోంది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Tirumala News: శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో ఏపీ మంత్రులు దాడిశెట్టి రాజా, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేష్ రెడ్డి, తెలంగాణ ఎమ్మెల్సీ బి.దయానంద్, తమిళనాడు మంత్రి అన్బిల్ మహేష్ పొయ్యమొళి, టీడీనీ ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, గోతిపటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్ లు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Ambati Rambabu: అది చేతకాక వేరే ఘటన తెరపైకి తెచ్చారు - అంబటి రాంబాబు ధ్వజం బాధితులకు వచ్చిన నష్ట పరిహారం డబ్బుల్లో సగం డిమాండ్ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వేళ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ‘‘రైతుల ఆత్మహత్యల పరిహారంలో డబ్బులు తీసుకున్నానని సత్తెనపల్లి నియోజకవర్గం ధూళిపాళ్ళ వచ్చి నాపై ఆరోపణలు చేసిన పవన్ కల్యాణ్ ను, నిరూపించమని నేను సవాల్ విసిరితే అది చేతకాక పారిపోయి, ఈ రోజు రైతులకు సంబంధం లేని వేరే ఘటనను తెరపైకి తీసుకొచ్చారు. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు’’ అని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్పై అధిష్ఠానం ఫోకస్, రంగంలోకి ఇద్దరు నేతలు
- తెలంగాణ కాంగ్రెస్ లో నెలకొన్న అసమ్మతులను చక్కదిద్దేందుకు రంగంలోకి దిగిన అధిష్ఠానం
- అధిష్ఠానం సూచనలతో రంగంలోకి దిగిన టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ నాయకులు కోదండరెడ్డి
- కొద్దిసేపట్లో సీఎల్పీ నేత భట్టి, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డి ఇళ్లకు వెళ్లి మాట్లాడనున్న మహేష్ కుమార్ గౌడ్, కోదండరెడ్డి..
- ఇప్పటికే ఏఐసీసీ నేత దిగ్విజయ్ సింగ్ కు తెలంగాణ కాంగ్రెస్ సమస్యల పరిష్కార బాధ్యతలు ఇచ్చినట్టు సమాచారం
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Panjab CM: నేడు తెలంగాణకు పంజాబ్ సీఎం పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్మాన్ నేడు హైదరాబాద్కు రానున్నారు. ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ కానున్నారు. ప్రస్తుత రాజకీయాలతోపాటు పలు అంశాలపై వారు చర్చించనున్నారు. ఆ తర్వాత పంజాబ్ సీఎం పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. ఫిబ్రవరిలో పంజాబ్లోని మొహాలిలో జరిగే ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో పాల్గొనాల్సిందిగా వారిని ఆహ్వానించనున్నారు.
పంజాబ్ శాసనసభ స్పీకర్ సర్దార్ కుల్తార్సింగ్ సంధ్వాన్ ఈ నెల 24న తెలంగాణకు రానున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ స్పీకర్ జైకిషన్ సింగ్ రౌరీ, రాజ్యసభ సభ్యుడు విక్రమ్జీత్ సింగ్ సాహ్ని, ఎమ్మెల్యే కుల్వంత్ సింగ్ పండోరి, మరో ఇద్దరు కూడా హైదరాబాద్కు రానున్నారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Chevireddy Bhaskar Reddy: ఎమ్మెల్యే చెవిరెడ్డి ఇంట్లో విషాదం చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట విషాదం నెలకొంది. చెవిరెడ్డి బాస్కర్ రెడ్డి తండ్రి చెవిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి (మణి రెడ్డి) అకాల మరణంతో తండ్రి పార్థివ దేహం వద్ద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బోరున విలపించారు. తనయుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పట్టుకొని తల్లి నాగరత్నమ్మ కన్నీటి పర్యాంతం అయ్యారు. తుమ్మలగుంట నివాసం వద్ద మనిరెడ్డి పార్థివ దేహానికి సినీనటుడు మోహన్ బాబు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, కలెక్టరు వెంకటరమణా రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పరామర్శించి మణి రెడ్డికి నివాళులు అర్పించారు. రేపు (బుధవారం) ఉదయం 9 గంటలకు తుమ్మలగుంట స్మశాన వాటికలో దహన సంస్కారాలు నిర్వహించనున్నారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Visakhapatnam: విశాఖలో నిషేధిత డ్రగ్స్ స్వాధీనం విశాఖ పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు 70 గ్రాముల ఎండీఎంఏ నిషేధిత డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఐదుగురు వ్యక్తులు అరెస్ట్ చేశారు. ట్రావెల్ బిజినెస్ లో నష్టాలు రావడంతో సుంకర ప్రశాంత్ తన స్నేహితులతో కలిసి ఈ డ్రగ్ వ్యాపారంలోకి దిగాడు. ఐదుగురు నిందితులు హోటల్ మేనేజ్మెంట్ కలిసి చదువు కున్నారు. వీరు న్యూ ఇయర్ వేడుకలను క్యాష్ చేసుకుందామని రంగంలోకి దిగి డ్రగ్స్ వ్యాపారంపై దృష్టి పెట్టారు. దీంతో బెంగుళూరు నుంచి మొత్తం 90 గ్రాములు ఎండీఎంఏ తీసుకువచ్చారు. ఈ క్రమంలో పోలీసులకు వచ్చిన పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్టు చేసినట్లు డీసీపీ -2 కె.ఆనంద్ రెడ్డి తెలిపారు. నూతన సంవత్సర వేడుకలు సందర్భంగా ఎవరైనా డ్రగ్స్ తో పట్టుపడిన, అమ్మిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Saroor Nagar: సరూర్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ఆందోళన
- హైదరాబాద్ సరూర్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ఆందోళన
- ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మద్దతు తెలిపిన మహేశ్వరం నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దేప భాస్కర్ రెడ్డి, మల్ రెడ్డి రాంరెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చల్ల నరసింహారెడ్డి
- కళాశాలలో ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కళాశాల ముందు విద్యార్థులు ఆందోళనకు దిగి నిరసన
- విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యా శాఖ కమిషనర్ వచ్చి సమస్యను పరిష్కరించాలని విద్యార్థుల డిమాండ్
- తెలంగాణలో విద్య వ్యవస్థ కుంటుపడిపోయిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గంలోని ప్రభుత్వ కళాశాలలో టాయిలెట్ సరిగా లేకపోవడం దారుణమన్న దేప భాస్కర్ రెడ్డి
- సమస్యలను పరిష్కారం చేయకపోతే మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్
- సోమవారం వరకు పనులు ప్రారంభం కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగుతామని హెచ్చరిక