Breaking News Live Telugu Updates: కాంగ్రెస్‌కు మరో షాక్! రేవంత్ పై మర్రి శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 17 Aug 2022 07:10 PM
అనంతపురం జిల్లా ఉరవకొండలో విద్యుత్‌శాఖ ఏఈపై దాడి

అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని రాయంపల్లిలో విద్యుత్ శాఖ ఏఈ గురుమూర్తి పై నెరమెట్ల గ్రామ సర్పంచ్ యోగేంద్ర రెడ్డి దాడి చేశారు. విద్యుత్ బకాయిల వసూలుకు వెళ్లిన ఏఈ గురుమూర్తి పై అమానుషంగా దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. రాయంపల్లి గ్రామంలో బకాయిల వసూలు చేస్తున్న విద్యుత్ ఏఈ కి, అటుగా వచ్చిన యోగేంద్ర రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. చెప్పుతో దాడి చేసి బూతులు తిట్టినట్టు అధికారులు వివరించారు. ఈమేరకు ఉరవకొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు విద్యుత్ శాఖ ఉద్యోగులు. తమ ఉద్యోగిపై దాడిని నిరసిస్తూ ఆందోళన బాటపట్టారు. 

అనంతపురం జిల్లా ఉరవకొండలో విద్యుత్‌శాఖ ఏఈపై దాడి

అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని రాయంపల్లిలో విద్యుత్ శాఖ ఏఈ గురుమూర్తి పై నెరమెట్ల గ్రామ సర్పంచ్ యోగేంద్ర రెడ్డి దాడి చేశారు. విద్యుత్ బకాయిల వసూలుకు వెళ్లిన ఏఈ గురుమూర్తి పై అమానుషంగా దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. రాయంపల్లి గ్రామంలో బకాయిల వసూలు చేస్తున్న విద్యుత్ ఏఈ కి, అటుగా వచ్చిన యోగేంద్ర రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. చెప్పుతో దాడి చేసి బూతులు తిట్టినట్టు అధికారులు వివరించారు. ఈమేరకు ఉరవకొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు విద్యుత్ శాఖ ఉద్యోగులు. తమ ఉద్యోగిపై దాడిని నిరసిస్తూ ఆందోళన బాటపట్టారు. 

తెలంగాణ లా సెట్‌ ఫలితాలు విడుదల

తెలంగాణలో లాసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయయి. ఈ రిజల్ట్స్‌ను తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి విడుదల చేశారు. పీజీ లాసెట్‌లో 91.10 మంది ఉత్తీర్ణులయ్యారు. మూడేళ్ల లాసెట్‌లో 74.76 శాతం మంది పాస్‌ అయ్యారు. ఐదేళ్ల లాసెట్‌లో 68.57 మంది గట్టెక్కారు. 

Marri Shashidhar Reddy: రేవంత్ రెడ్డిపై మర్రి శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ కాంగ్రెస్‌లో మరో నేత టీపీసీసీకి వ్యతిరేకంగా మారారు. అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పీసీసీ సీటును కొన్నారని తాను కూడా నమ్ముతున్నానని మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దాసోజు, రాజగోపాల్ రెడ్డి ఆరోపణలు నిజమేనని తాను కూడా నమ్ముతున్నానని అన్నారు. తామేమైనా  హోం గార్డుల్లాగా కనిపిస్తున్నామా? అని ప్రశ్నించారు. 

Telangana Congress: గాంధీభవన్ లో మునుగోడు నియోజకవర్గ మండల ఇంచార్జ్ ల సమావేశం

  • గాంధీభవన్ లో ప్రారంభమైన మునుగోడు నియోజకవర్గ మండల ఇంచార్జ్ ల సమావేశం

  • పాల్గొన్న ఏఐసీసీ ఇంచార్జ్ మనిక్కమ్ ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, నదీమ్ జావిద్, రోహిత్ చౌడరీ, వర్కింగ్ ప్రసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ మండల ఇంఛార్జీలు

  • మునుగోడు ఉప ఎన్నికల వ్యూహ రచనపై చర్చిస్తున్న నాయకులు

Gudiwada Amarnath: పవన్ కల్యాణ్‌పై గుడివాడ అమర్ నాథ్ కామెంట్స్

ప్రధాని  మోదీ దగ్గర  వేషాలు వేయాల్సిన  అవసరం  మాకు  లేదని ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ  అమరనాథ్ వ్యాఖ్యానించారు. పవన్  కళ్యాణ్  అసలు  బీజేపీతో  ఉన్నారా అని ప్ర‌శ్నించారు.  పవన్ ను తామేమి అన‌లేద‌న్నారు. పవన్  కళ్యాణ్  ది  కాపు  జనసేన  కాదని, కమ్మ  జనసేన అని ఎద్దేవా చేశారు. నాదెండ్ల   డైరెక్షన్  లో  నడిచేది  కమ్మ  జనసేన అని, పవన్  నడిపేది   కమ్మ  జనసేన అని కాపులు  పవన్  ను   ఓన్  చేసుకునే  పరిస్థితి  లేదన్నారు. లోకేష్  కు వెయిట్ లాస్  పేరుతో  మైండ్ లాస్   అయిందని, తండ్రీకొడుకులు  ఇద్దరు వాళ్ళు  అధికారంలో  లేకపోతే  ఏమి  జరగకూడదు  అనే  ఫీలింగ్ లో ఉంటార‌న్నారు. యొకోహమా  సంస్థ  ప్రతినిధులు, సీఈఓలు  మాట్లాడిన అంశాలు  ఒక్కసారి  ప్రతిపక్షాలు  వినాలని, 2020 ఆక్టోబర్ లో  ఏపీకి  వచ్చాయని అన్నారు.

Bapatla: అక్రమ సంబంధం నేపథ్యంలో హత్యాయత్నం

అక్రమ సంబంధం నేపథ్యంలో హత్యాయత్నం ఘటన బాపట్ల జిల్లాలో జరిగింది. పోలీసులు, బాధితుడి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.  బాపట్ల జిల్లా చుండూరు మండలం యడ్లపల్లికి చెందిన అంజిరెడ్డి భార్యకు అదే గ్రామానికి చెందిన ఏడుకొండలు రెడ్డితో వివాహేతర సంబంధం ఉంది. గతంలో పెద్దల సమక్షంలోనూ పంచాయతీ జరిగింది. ఈ క్రమంలో అంజిరెడ్డి వ్యక్తిగత పనులపై మంగళవారం విజయవాడ వెళ్లి రాత్రికి తిరిగి ఇంటికి వెళుతుండగా, తెనాలి పట్టణ పరిధిలో పినపాడు గ్యాస్ గోడౌన్ సమీపంలో అతనిపై హత్యాయత్నం జరిగింది. 


తనపై ఏడుకొండలురెడ్డి హత్యాయత్నం చేయించాడని, తమకు తెలిసిన కృష్ణారెడ్డి మరో గుర్తు తెలియని వ్యక్తి తనపై కత్తి, ఇనుప రాడ్తో దాడి చేసి గాయపర్చారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు త్రీ టౌన్ ఎస్ఐ వి. కలగయ్య తెలిపారు.

Mangalagiri: మంగళగిరి మండలం ఆత్మకూరులో చిట్టీ వ్యాపారి ఇంటిపై దాడి

  • మంగళగిరి మండలం ఆత్మకూరులో చిట్టీ వ్యాపారి ఇంటిపై దాడి

  •  ఆత్మకూరు నుంచి గతేడాది పరారైన చిట్టీ వ్యాపారి శ్రీనివాసరావు

  •  శ్రీనివాసరావు ఇంటిపై అర్ధరాత్రి బాధితుల దాడి, ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం

  •  చిట్టీ వ్యాపారి శ్రీనివాసరావు కుమారుడిని ఎత్తుకెళ్లిన బాధితులు

  •  రామచంద్రపురం వద్ద కృష్ణా నదికి తీసుకెళ్లినట్లు శ్రీనివాసరావు కుమారుడు ఫిర్యాదు

  • కృష్ణా నదిలో మోకాలు లోతు నీళ్లలో నిలబెట్టి బెదిరించారని ఫిర్యాదు

  •  పోలీసులు వస్తున్నారని ఆత్మకూరులో వదిలిపెట్టి పరారయ్యారని ఫిర్యాదు

  •  రూ.30 లక్షలు ఇవ్వకపోతే చంపుతామంటూ బెదిరించారని ఫిర్యాదు

Background

ఇటీవల ఏర్పడిన అల్పపీడనం ముప్పు తొలగిపోయిందనుకుంటున్న సమయంలో భారత వాతావరణ కేంద్రం మరో పిడుగులాంటి ప్రకటన చేసింది. ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని తెలిపింది. ఆగస్టు 19 నాటికి ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడనుందని వెల్లడించింది. ఉత్తర - దక్షిణ ద్రోణి రాయలసీమ నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు తమిళనాడు అంతర్భాగంగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, యానాం, తెలంగాణలో నేటి రెండు రోజులపాటు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. 


తెలంగాణలో తేలికపాటి జల్లులు
వాయుగుండం తీరాన్ని దాటడంతో మంగళవారం రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలతో పాటు వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్ ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో గాలులు వీస్తూ కొన్నిచోట్ల వర్షాలు కురిశాయి. నేడు, రేపు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయి. దక్షిణ తెలంగాణకు వర్ష సూచన లేదు. ఉదయం వేళ చల్లగా ఉంటూ, మధ్యాహ్నానికి వాతావరణం పూర్తిగా వేడెక్కుతుంది. మరో రెండు రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని, ఆగస్టు 19 నుంచి 21 వరకు రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేశారు.


ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
ఈ ప్రాంతాల్లో మంగళవారం పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. ధవళేశ్వరం వద్ద నీటి ప్రవాహం పెరుగుతోంది.  ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నేడు, రేపు తేలికపాటి జల్లులు పడతాయి. తీరంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.


దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
వాయుగుండం బలహీనపడి తీరాన్ని దాటడంతో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో నేడు తేలికపాటి నుంచి మోస్తరు నుంచి వర్షాలు కురవనున్నాయి. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది వాతావరణ కేంద్రం. రాయలసీమలోని ఉమ్మడి కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలలో నేడు, రేపు తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు పడతాయని చెప్పారు. 


హెచ్చరిక: భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. అరటితోటలకు నష్టం వాటిల్లుతుంది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు నష్టం జరుగుతుందన్నారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.