Breaking News Live Telugu Updates: కేసీఆర్ మాట ప్రతి ఒక్కటీ అబద్ధమే - బోధన్‌లో వైఎస్ షర్మిల పాదయాత్ర

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 16 Oct 2022 11:56 AM
YS Sharmila: 8 ఏళ్లుగా కేసీఅర్ ను ప్రశ్నించే పార్టీ లేకుండా పోయింది - వైఎస్ షర్మిల

నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం పంటకుర్థ్ గ్రామంలో వైఎస్ షర్మిల పాదయాత్ర సాగుతొంది. ఈ సందర్భంగా  షర్మిల మాట్లాడుతూ.. కేసీఅర్ తో తెలంగాణ ప్రజలకు ఎలవంటి న్యాయం జరగలేదని అన్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదని అన్నారామే. ‘‘రుణమాఫీ దగ్గర నుంచి ఇంటికో ఉద్యోగం వరకు ప్రతి మాట మోసమే.... ఉద్యోగాలు లేవు...నోటిఫికేషన్ లేవు అంటే హమాలి పని చేసుకోండి అంటున్నారు కేసీఆర్ అని అన్నారు షర్మిల. పెద్ద కొడుకు అని చెప్పి ఇంట్లో ఒకరికే పెన్షన్ ఇస్తున్నాడు. ఒకరు బ్రతకండి..ఒకరు చావండి అని చెప్తున్నారు. వైఎస్ ఆర్ హయాంలో రేషన్ కింద నిత్యావసర వస్తువులు ఇచ్చేవారు. ఇప్పుడు దొడ్డు బియ్యం ఇస్తూ సీఎం కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారు’’ అని అన్నారు షర్మిల. వెల్ఫేర్ హాస్టళ్లలో పురుగులు పట్టిన అన్నం పెడుతున్నారని.. ఆ బిడ్డలకు ఓట్లు ఉండవు అని చెప్పి హీనంగా చూస్తున్నారని విమర్శించారు. 


ధరలు భారీగా పెంచేశారు


‘‘పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు భారీగా పెంచేశారు. వంట సరుకులు పెంచి మహిళల ఉసురు పోసుకుంటున్నారు. వైఎస్ ఆర్  ఉన్నప్పుడు గ్యాస్ సిలిండర్ పై 50 రూపాయలు పెరిగితే ప్రభుత్వం భరించేలా చేశారు. నాయకుడు అంటే వైఎస్ ఆర్. బ్రతికినంత కాలం ప్రజల కోసమే బ్రతికాడు. ప్రజలకోసమే చనిపోయాడు. ఇప్పుడు ప్రజల పక్షాన కొట్లాడే పార్టీ లేనే లేదని అన్నారు షర్మిల. 8 ఏళ్లుగా కేసీఅర్ ను ప్రశ్నించే పార్టీ లేకుండా పోయింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సైతం ప్రజలను మోసం చేశాయి. ప్రజల కోసం.. ప్రజల పక్షాన నిలబడటం కోసం పార్టీ పెట్టాం. వైఎస్సార్ సంక్షేమ పాలన ప్రతి గడపకు అందిస్తామని అన్నారు షర్మిల’’ అని షర్మిల అన్నారు.

Background

ఉపరితల ఆవర్తనం బలపడి ఇదివరకే తేలికపాటి అల్పపీడనంగా మారింది. ఉపరితల ఆవర్తనం కర్ణాటక వైపు వెళ్లినా దీని ప్రభావం ఏపీ, తెలంగాణపై కొనసాగుతోంది. దాంతో నేడు సైతం ఏపీ, తెలంగానలో పలు జిల్లాల్లో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురవనున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షం పడుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎల్లో వార్నింగ్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. మధ్య బంగాళాఖాతం, కొమరిన్‌ పరిసరాల్లో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. కర్ణాటక నుంచి మహారాష్ట్ర మీదుగా మధ్య భారతం వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. 
ఈ నెల 17 లేదా 18న ఉత్తర అండమాన్‌ సముద్రంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుంది. ఇది ఉత్తర తమిళనాడు, కోస్తాంధ్ర తీరాల వైపు కదులుతుందని భారత వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఈశాన్య రుతుపవనాలు రెండు రోజుల్లో ఏపీలోకి ప్రవేశించనున్నాయని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. నేడు సైతం పలు జిల్లాలకు వర్ష సూచనతో అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు ఎల్లో అలర్ట్ జారీ చేశాయి. 
 
తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather Updates)
బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావం రెండు రోజుల వరకు రాష్ట్రంపై ఉండనుంది. కొన్ని జిల్లాలకు వర్ష సూచనతో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. అక్టోబర్ 17 వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. నిన్న కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట జిల్లాలకు వర్ష సూచనతో ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. 



నేడు కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయని వాతావరణశాఖ తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ ఆకాశాన్ని మేఘాలు కమ్మేశాయి. తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని అంచనా వేశారు. మరికొన్ని గంటల్లో మంచిర్యాల, కామారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. వేగంతో తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. 


ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
శ్రీకాకుళం, విజయనగరం, కొనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలున్నాయి. విశాఖ నగర వాతావరణ సూచన - విశాఖ నగరంలో తెల్లవారిజాము నుంచి కొద్దిసేపటి వరకు వర్షాలుంటాయి. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు తక్కువ వర్షాలతో ప్రశాంతంగా ఉంటుంది. వర్ష సూచనతో ఉత్తరాంధ్ర జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అల్పపీడనం, దాని అనుబంధ ఉపరితల ఆవర్తనం శ్రీలంక ఉత్తర తీరానికి సమీపంలో సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. అత్యధికంగా కొనసీమ జిల్లాలోనే వర్షాలుంటాయి. కొన్ని చోట్లల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కూడ పడే అవకాశం ఉందని అంచనా వేశారు. అనకాపల్లి పెందుర్తి, వైజాగ్ చుట్టుపక్కనే ఉన్న ప్రాంతాల్లో వర్షాలు అధికంగా ఉంటాయి. నైరుతి, తూర్పు బంగాళాఖాతం దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. 


దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
అల్పపీడనం ప్రభావం దక్షిణ కోస్తాంధ్రపై అధికంగా ఉంది. నేడు కృష్ణా, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు పడతాయి. అక్టోబర్ 20న బలమైన అల్పపీడనం ఏర్పడుతుందని దాని ప్రభావంతో అక్టోబర్ 22న తుఫాను ఉందని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. నెల్లూరు జిల్లాలోని నెల్లూరు నగరానికి పశ్చిమ భాగాల్లోని ప్రాంతాలు, తిరుపతి జిల్లా గూడూరు ప్రాంతంలో మోస్తరు వర్షాలున్నాయి. రాయలసీమ జిల్లాల్లో ఈ రోజు అక్కడక్కడ మాత్రమే వర్షాలున్నాయి. అర్ధరాత్రి అన్నమయ్య, కడప, సత్యసాయి, అనంతపురం జిల్లాల్లోని పలు భాగాల్లో మాత్రం వర్షాలను చూడగలం.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.