Breaking News Live Telugu Updates: తెలంగాణ వ్యాప్తంగా ముగిసిన జాతీయ గీతాలాపన
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
ABP Desam Last Updated: 16 Aug 2022 12:35 PM
Background
వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ బలహీనపడింది. అంతకుముందు ఈ వాయుగుండం ఉత్తర ఛత్తీస్ గఢ్ దాని పరిసరాల్లో గంటకు 25 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదిలి మధ్యప్రదేశ్ లో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, యానాంలో...More
వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ బలహీనపడింది. అంతకుముందు ఈ వాయుగుండం ఉత్తర ఛత్తీస్ గఢ్ దాని పరిసరాల్లో గంటకు 25 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదిలి మధ్యప్రదేశ్ లో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలు వీస్తాయి.తెలంగాణలో వాతావరణం ఇలా..తీవ్ర వాయుగుండం నిన్న బలహీనపడింది. దీని ప్రభావంతో మంగళవారం సైతం తెలంగాణలో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్నిచోట్ల తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో కొన్నిచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో కొన్నిచోట్ల గాలులు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో వీచనున్నాయి. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే చోట ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..ఆదివారం, సోమవారం పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. నేడు సైతం ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. తీరంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయి. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..వాయుగుండం బలహీనపడటంతో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు నుంచి వర్షాలు కురవనున్నాయి. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడతాయి. ఒకట్రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది వాతావరణ కేంద్రం. రాయలసీమలోని ఉమ్మడి కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలలో నేడు, రేపు తేలికపాటి జల్లులు పడతాయని చెప్పారు.హెచ్చరిక: భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. అరటితోటలకు నష్టం వాటిల్లుతుంది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు నష్టం జరుగుతుందన్నారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.బంగారం, వెండి ధరలుతెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (Todays Gold Rate) నిన్నటితో పోలిస్తే నేడు నిలకడగా ఉంది. వెండి ధరలో కూడా నేడు ఎలాంటి మార్పూ లేదు. కానీ, ప్లాటినం ధరలో మార్పు కనిపించింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ (Hyderabad Gold Rate) మార్కెట్లో రూ.48,150 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.52,530 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో నేడు రూ.64,800 గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)Gold Rates Today విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,150 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,530గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.64,800 గా ఉంది. విజయవాడలో పసిడి ధర ఇలా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.48,150 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.52,530 గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.64,800 గా ఉంది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
జమ్మూకాశ్మీర్ లో విషాదం - ఆర్మీ బస్సుబోల్తా పడి ఆరుగురు జవాన్లు మృతి
జమ్మూకాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పహల్ఘం వద్ద ఆర్మీ బస్సు బోల్తా పడటంతో.. అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు ఐటీబీపీ జవాన్లు చనిపోయారు. 32 మంది జవాన్లకు గాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.