Breaking News Live Telugu Updates: KKR Vs SRH: సన్ రైజర్స్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ మెరుపు సెంచరీ, కేకేఆర్ ముందు భారీ టార్గెట్

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 14 Apr 2023 09:16 PM
KKR Vs SRH: సన్ రైజర్స్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ మెరుపు సెంచరీ, కేకేఆర్ ముందు భారీ టార్గెట్

కోల్‌కతా నైట్‌రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ అజేయ శతకంతో చెలరేగాడు. కేవలం 55 బంతుల్లో సెంచరీతో అజేయంగా నిలిచాడు. ఐపీఎల్ 16 సీజన్ లో నమోదైన తొలి శతకం హ్యారీ బ్రూక్ దే. సన్ రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది.

దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సీబీఐ నోటీసులు 

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ నోటీసులు ఇచ్చింది. దిల్లీ మద్యం కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ ప్రశ్నించనుంది. ఏప్రిల్ 16న విచారణకు రావాలని అరవింద్ కేజ్రీవాల్‌కు సీబీఐ సమన్లు ఇచ్చింది. 
 

125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన కేసీఆర్, ప్రకాశ్ అంబేద్కర్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ 125 అడుగుల విగ్రహాన్ని ఆయన మనవడు ప్రకాష్ అంబేడ్కర్, సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహంపై హెలికాప్టర్ తో పూల వర్షం కురిపించారు. ఈ వేడుకలో బౌద్ధ గురువులు, రాష్ట్ర మంత్రులు, ఇతర నేతలు పాల్గొన్నారు. 

అంబేద్కర్ విగ్రహంపై హెలికాప్టర్ తో పూల వర్షం

అంబేద్కర్ విగ్రహంపై హెలికాప్టర్ తో పూల వర్షం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ 125 అడుగుల విగ్రహావిష్కరణ ఏర్పాట్లు పూర్తయ్యాయి.  దేశంలోనే అతిపెద్ద విగ్రహాన్ని హుస్సేన్‌సాగర్‌ తీరంలో తెలంగాణ సర్కార్‌ నిర్మించింది. శుక్రవారం  ముఖ్యమంత్రి కేసీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. విగ్రహావిష్కరణ అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహించనుంది తెలంగాణ ప్రభుత్వం. దీంతో ఈ ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. అంబేద్కర్‌ విగ్రహం దిగువన ప్రాంగణంలో తుదిదశ పనులు కొనసాగుతున్నాయి. తుది పనులు పూర్తి చేసి ఆ తర్వాత అలంకరణ పనులు చేపట్టనున్నారు. పక్కనే బహిరంగ సభకు కూడా ఏర్పాట్లు చేశారు. 

Samyukta Menon: శ్రీవారి సేవలో సినీ నటి‌‌ సంయుక్త మీనన్

విరూపాక్ష చిత్రం ఈ నెల‌ 21న విడుదల కానుందని హీరోయిన్ సంయుక్త మీనన్ స్పష్టం చేసారు.. శుక్రవారం ఉదయం  తిరుమల శ్రీవారి విఐపి విరామ సమయంలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి ‌స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ.. "సార్" సినిమా విజయం అనంతరం తాను నటించిన చిత్రం విరూపాక్ష చిత్రం విజయం సాధించాలని స్వామి వారిని మొక్కకున్నట్లు చెప్పారు.. ఈ నెల 21వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని, ప్రేక్షకులు ఈ చిత్రంను ఆదరించాలని ఆమె కోరారు.. సినీ నటి సంయుక్త మీనన్ ను కొండపై చూసిన అభిమానులు ఆమెతో ఫోటోలు దిగడానికి ఉత్సాహం చూపారు.

Jubilee Hills: మాజీ ప్రియురాలు ఇంటికి వెళ్ళి అత్యాచార యత్నం

  • మాజీ ప్రియురాలు ఇంటికి వెళ్ళి అత్యాచార యత్నం

  • జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన

  • నిందితుడు లలిత్ సెహగల్ పబ్ లో గిటారిస్ట్

  • IPC 376 రెడ్ విత్ 511, 354, 323, 509 సెక్షన్ల కింద కేసు నమోదు

  • అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు

Prakash Ambedkar: హుజూరాబాద్ కు ప్రత్యేక చాపర్ లో బయలుదేరిన ప్రకాశ్ అంబేడ్కర్

అంబేడ్కర్ మనవడు ప్రకాష్ యశ్వంత్ అంబేడ్కర్ తో కలిసి బేగంపేట విమానాశ్రయం నుండి హుజూరాబాద్ కు ప్రత్యేక చాపర్ లో బయలుదేరిన మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే బాల్క సుమన్.

Prakash Ambedkar: ప్రకాశ్ అంబేడ్కర్‌కు మంత్రి గంగుల ఘన స్వాగతం

భారతరత్న, బాబాసాహెబ్ 125 అడుగుల విగ్రహావిష్కరణకు సర్వం సిద్దమైంది, సీఎం కేసీఆర్ దార్శనికతతో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బాబాసాహెబ్ విగ్రహావిష్కరణ వేడుకలకు ముఖ్య అతిథిగా హైదరాబాద్ విచ్చేసిన బాబాసాహెబ్ మనుమడు, మాజీ ఎంపీ ప్రకాష్ అంబేద్కర్ ని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ఘనంగా స్వాగతించారు. శాలువా కప్పి సన్మానించి దళితబందు జ్ణాపికను అందజేసారు. నేడు హుజురాబాద్లో దళితబందు లబ్ధిదారులను కలిసి వారి అనుభవాలను, దళితబంధు ద్వారా వారి జీవితాల్లో వచ్చిన సమూల మార్పుల గురించి ప్రకాష్ అంబేద్కర్ తెలుసుకోనున్నారు. మంత్రి గంగులతో పాటు, విప్ బాల్క సుమన్ ఇతర ఉన్నతాధికారులు ప్రకాష్ అంబేద్కర్ ని హుజురాబాద్ దళితబందు లబ్దీదారుల వద్దకు తీసుకొని వెల్తారు, పర్యటన అనంతరం బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు.

Background

నేడు (ఏప్రిల్ 14) ఉదయం నుంచే హైదరాబాద్ సహా తెలంగాణలోపి కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు నేడు ఉదయం 6 గంటలకు విడుదల చేసిన వెదర్ బులెటిన్ ప్రకారం.. వచ్చే 3 గంటల్లో నాగర్ కర్నూల్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి, నారాయణపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కొనసాగుతుందని చెప్పారు. 


నిన్నటి ద్రోణి/ గాలిలోని అనిచ్చితి, ఈ రోజు తూర్పు విదర్భ నుండి మరాత్వాడ, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా కోస్తా కర్ణాటక వరకు సగటు సముద్రం మట్టంకి 0.9 కిలో మీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతుంది. దిగువ స్థాయిలో గాలులు ఈ రోజు ఆగ్నేయ దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయి.


రాగల మూడు రోజులు  తెలంగాణ రాష్ట్రంలో  తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. రాగల మూడు రోజులు  పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ   41 డిగ్రీల నుండి 44 డిగ్రీల మధ్యన రాష్ట్రంలో అనేక చోట్ల నమోదు అయ్యే అవకాశం ఉంది. GHMC, చుట్టు ప్రక్కల జిల్లాలలో  38 డిగ్రీల నుండి 41 డిగ్రీల మధ్యన నమోదు అయ్యే అవకాశం ఉంది.


హైదరాబాద్ లో ఇలా
‘‘హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఉరుములతో కూడిన మేఘాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 39 డిగ్రీలు, 26 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశ నుంచి గాలులు గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 38.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 26.4 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 36 శాతం నమోదైంది.


ఏపీలో ఎండలు ఇలా
నేటి నుంచి ఏపీలో ఎండల తీవ్రత మరింత పెరగనుంది. ఒక పక్కన ఆంధ్రాలో ప్రస్తుతం 41-42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చూస్తూ వచ్చాము. కానీ మరో మూడు రోజుల పాటు ఇది కాస్త 42 నుంచి 43 డిగ్రీల మధ్యలో ఉండనుంది. కారణం ఏమిటి అంటే పొడిగాలులు ఉత్తర భారత దేశం నుంచి నేరుగా మన వైపుగా వీస్తున్నాయి కాబట్టి వేడి తీవ్రత ఎక్కువవ్వనుంది. విశాఖ నగరంలో కూడ నేటి నుంచి మరో మూడు రోజులు వేడిగా ఉంటుంది. అనకాపల్లి, కాకినాడ​, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మణ్యం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల​, ఏలూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంధ్యాల​, కడప​, తూర్పు అనంతపురం, అన్నమయ్య​, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో వేడి 42 నుంచి 43 మధ్యలో ఉండనుంది.


ఆంధ్రప్రదేశ్ లో విరగ కాస్తోంది. ప్రస్తుతానికి పొడి గాలులు కోస్తా ప్రాంతం మీదుగా వీస్తోంది కాబట్టి వేడి అనేది చాలా ఎక్కువగా ఉంది. ప్రకాశం జిల్లాలోని గుండ్లపల్లిలో అత్యధికంగా 43.2 డిగ్రీలు నమోదయ్యింది. అలాగే నంద్యాల​, కడప​, చిత్తూరు జిల్లాలో కూడ 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలకు మించి నమోదయ్యింది. ప్రకాశం జిల్లా జువ్విగుంటలో 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఒక ప్రకాశం జిల్లానే కాదు కోస్తాంధ్ర వ్యాప్తంగా, రాయలసీమ జిల్లాలతో పాటుగా తూర్పు తెలంగాణలో వేడి భాగా పెరిగింది. చాలా చోట్లల్లో 42 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతోంది. రేపు ఈ వేడి కంటే ఇంకాస్త వేడి ఉండే అవకాశాలున్నాయి. జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. గత నెలలో వర్షాలు ఏంటి అని అనుకుంటూ ఉన్నాం, కానీ ఈ నెలలో ఎండలు మామూలుగా లేవు. మరి ఇంకా మంచి ఎండలు ముందు ఉంది’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.