Breaking News Live Telugu Updates: ప్రీతి మృతి కేసు - సైఫ్ ను 4 రోజులు పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చిన జిల్లా కోర్టు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 01 Mar 2023 10:08 PM
జీవో 59పై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణకు ఇచ్చిన జీవో 59 ప్రకారం 2014 నాటి మార్కెట్ విలువల ఆధారంగా ఫీజులు లెక్కించడానికి బదులుగా, దరఖాస్తు చేసుకున్న తేదీ నాటి మార్కెట్ విలువల ఆధారంగా ఫీజు నిర్ణయిస్తు, జీవో 59కి సవరణ చేస్తూ జీవో నం.22ని ప్రభుత్వం జారీ చేసింది.

ప్రీతి మృతి కేసు - సైఫ్ ను 4 రోజులు పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చిన జిల్లా కోర్టు

ప్రీతి మృతి కేసు అప్డేట్ 


సైఫ్ ను వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసుల పిటిషన్


నాలుగు రోజులు పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చిన జిల్లా కోర్టు


రేపటి నుంచి నాలుగు రోజుల పాటు సైఫ్ ను విచారించనున్న పోలీసులు

ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డికి తప్పిన ప్రమాదం

హైదరాబాద్‌ : నగరంలోని ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. బుధవారం కీసర రింగ్ రోడ్డు నుంచి ఉప్పల్‌ వైపు వస్తుండగా కుక్కలు అడ్డు రావడంతో ముందు వెళ్తున్న వాహనం సడెన్ బ్రేక్ వేయడంతో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు వెనకాల నుంచి వచ్చి ఢీ కొట్టింది. దీంతో కారులో ఉన్న ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి తో పాటు మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. తాను సురక్షితంగా ఉన్నానని, కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే కోరారు.

CM KCR in Timmapur: బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో సీఎం కేసీఆర్

బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్‌ మండలం తిమ్మాపూర్‌ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవ వేడుకల్లో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. 





Tirumala News: శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామి వారి నైవేద్య విరామ‌ సమయంలో ఏపి స్పీకర్ తమ్మినేని సీతారాం,‌ డెప్యూటీ స్పీకర్ కోలగట్ల‌ వీరభధ్రస్వామిలు కలిసి స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. దర్శనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన డెప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి మీడియాతో మాట్లాడుతూ. ఏపి ముఖ్యమంత్రి వైస్.జగన్మోహన్ రెడ్డికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, ‌సంక్షేమ‌ పథకాలు నడపేందుకు అవసరం అయ్యే శక్తి ప్రసాదించాలని ప్రార్ధించినట్లు తెలిపారు. అదేవిధంగా ఈ‌ నెలలో జరుగబోయే బడ్జెట్ శాసనసభ సమావేశాలు సాఫీగా సాగాలని, ఈ సమావేశాలకు ఎటువంటి అవరోధం కలిగించకుండా మంచి జ్ఞానాన్ని ప్రతిపక్ష పార్టీకి కలిగించాలని వేడుకున్నామన్నారు. ప్రజా వినియోగం కావాల్సిన అంశాలు శాసన సభలో‌ ప్రస్తావనకు వస్తాయో, ఆ అంశాలను అందరూ ఆమోదం తెలియజేస్తే ఈ రాష్ట్ర ప్రజానీకానికి మేలు జరుగుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ‌ బడ్జెట్ అందరికి ఆశాజనకంగా ఉంటుందని అన్నారు.

YS Rajashekhar Reddy: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ధ్వంసం

మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలం అవుతాపురం గ్రామంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ధ్వంసం చేసిన గుర్తుతెలియని దుండగులు


గత నెల 16వ తేదీన వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన వైఎస్ షర్మిల


వైయస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థాన పాదయాత్ర 3800 మైలురాయి చేరుకున్న సందర్భంగా అవుతాపురం గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహం ఏర్పాటు


గత నెల 16వ తేదీన ఉద్రిక్త పరిస్థితి నడుమ ప్రారంభోత్సవం జరిగిన వైఎస్ఆర్ విగ్రహం


అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో వైయస్సార్ విగ్రహం ధ్వంసం

Guntur Murders: గుంటూరులో అర్ధరాత్రి రెండు దారుణ హత్యలు

  • గుంటూరు నగరంలో అర్ధరాత్రి రెండు దారుణ హత్యలు..

  • ఒక్కసారిగా ఉలిక్కి పడిన గుంటూరు నగర ప్రజలు..

  • అరండల్ పేట లోని లిక్కర్ మార్ట్, అమరావతి రోడ్డులోని యమహా షోరూం వాచ్‌మెన్లను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..

  • ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించి వివరాలు సేకరిస్తున్న గుంటూరు డీఐజీ త్రివిక్రమ్ వర్మ, ఎస్పీ అరీఫ్ హఫీజ్, డీఎస్పీ, సీఐలు

  • అమరావతి రోడ్ లో గల యమహా షోరూంలో వాచ్‌మెన్ శ్రీరామ్ కృపానిధి వయస్సు 65

Anakapally Murder: అనకాపల్లి జిల్లాలో వ్యక్తిదారుణ హత్య - తల, మొండెం వేరు!

  • అనకాపల్లి జిల్లా మునగపాక మండలం గణపర్తిలో గ్రామంలో
    వ్యక్తిదారుణ హత్య

  • తల మొండెం వేరుచేసి గోనెసంచిలో మృతదేహాన్ని గుర్తించిన గ్రామస్తులు

  • పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్న మునగపాక పోలీసులు

  • హత్యకు గురైన వారి వివరాలు సేకరిస్తున్న పోలీసులు

  • హత్య చేసి గోనె సంచిలో మృత దేహాన్ని ఉంచడంతో భయాందోళన చెందుతున్న గ్రామస్తులు

Sri Chaintanya Student: శ్రీ చైతన్య కాలేజీలో స్టూడెంట్ ఆత్మహత్య, క్లాస్ రూంలోనే ఉరి

  • శ్రీ చైతన్య కాలేజీలో స్టూడెంట్ ఆత్మహత్య, క్లాస్ రూంలోనే ఉరి

  • నార్సింగి శ్రీ చైతన్య కాలేజ్ లో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఎన్.సాత్విక్ ఆత్మహత్య

  • రాత్రి 10:30 సమయంలో క్లాస్ రూమ్ లో ఉరివేసుకుని ఆత్మహత్య.. 

  • కాలేజీలో ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకున్నట్టు చెప్తున్న తోటి స్టూడెంట్స్.. 

  • పట్టించుకోని కాలేజీ సిబ్బంది, కనీసం హాస్పిటల్ కి కూడా తరలించని సిబ్బంది.. 

  • సాత్విక్ ని దగ్గర్లోని హాస్పిటల్ కి తీసుకువచ్చిన తోటి విద్యార్థులు.. 

  • బయట వెహికిల్ ని లిఫ్ట్ అడిగి సాత్విక్ ని హాస్పిటల్ కి తీసుకెళ్లిన తోటి విద్యార్థులు.. 

  • హాస్పిటల్ కి తరలించే లోపే సాత్విక్ మృతి.. 

  • పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి మృతదేహం తరలింపు..

Background

పొడి గాలుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం లేదని వాతావరణ అధికారులు తెలిపారు. ఉత్తర వాయువ్య దిశ నుంచి వస్తున్న పొడిగాలుల వల్ల పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వారు అంచనా వేశారు. వచ్చే మూడు రోజులు రాత్రి వేళ ఉష్ణోగ్రతలు తగ్గడంతో పాటు పగటిపూట వేడి పెరుగుతుందని అంచనా వేశారు. 


ఇక తెలంగాణలో క్రమంగా చలి తగ్గి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాత్రి పూట చలి విషయంలో నేడు అన్ని జిల్లాల్లో సాధారణంగానే ఉండనుంది. నిన్న మొన్నటి వరకూ కూడా కనిష్ఠ ఉష్ణోగ్రతల విషయంలో కొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ లేదా ఆరెంజ్ అలర్ట్ ఉండేది. మామూలుగా 5 నుంచి 10 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందనిపిస్తే వాతావరణ విభాగం ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేస్తుంది. 11 నుంచి 15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంటే ఎల్లో అలెర్ట్ జారీ చేస్తుంటారు. రాబోయే ఐదు రోజులకు సంబంధించి తెలంగాణ వాతావరణ విభాగం నమోదు కానున్న ఉష్ణోగ్రతల అంచనాలను వెదర్ బులెటిన్‌లో వివరించింది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ఏ జిల్లాలోనూ ఎలాంటి అలర్ట్ జారీ చేయలేదు.


హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం నిర్మలంగా ఉంటుంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడుతుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 35 డిగ్రీలు, 20 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశ నుంచి గాలులు గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 33.9 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 20.4 డిగ్రీలుగా నమోదైంది.


ఏపీలో ఇలా
ఆంధ్రప్రదేశ్‌ వాతావరణ విభాగం తెలిపిన వివరాల మేరకు ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిల్లో ఆగ్నేయ, నైరుతి దిశలలో గాలులు వీస్తున్నాయని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒకటి లేదా రెండు చోట్ల పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.









 


ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఏపీలోని ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటనలో తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో కూడా పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకూ తక్కువగా ఒకటి లేదా రెండు చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. 


ఎల్ నినో ఏర్పడే అవకాశాలు
మరో 3 లేదా 4 రోజుల్లో ఎండల స్థాయి 40 డిగ్రీలకు చేరుతుందని ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. ‘‘ఎల్-నినో ఏర్పడే అవకాశాలు ఈ ఏడాది కనిపిస్తున్నాయి కాబట్టి రానున్న మూడు నెలల్లో ఎండల వేడి బాగా ఎక్కువ ఉండనుంది. పసిఫిక్ మహా సముద్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న లా-నినా ఇప్పుడు బాగా బలహీనపడింది. దీని ప్రభావం మరి కొన్ని రోజుల్లో పూర్తిగా తగ్గనుంది. మార్చి నుంచి మే నెలలో మనకు ఎండలు బాగానే కాస్తాయి.


కానీ గత మూడు సంవత్సరాలుగా సాధారణం కంటే తక్కువగానే ఎండలు ఉన్నాయి. చాలా మంది ఇది కోవిడ్ లాక్ డౌన్ వలన ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంది అని అనుకున్నారు, కానీ ఇది కోవిడ్ లాక్ డౌన్ వలన కాదు. ఇది పసిఫిక్ లో ఏర్పడిన లా-నినా ప్రభావం. కాబట్టి రానున్న రోజుల్లో లానినా ఉండదు కాబట్టి. ఎండలు సాధారణం కంటే ఎక్కువ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.


2003, 2009, 2012, 2015, 2018 సంవత్సరాల్లో ఎల్-నినో ఏర్పడే తరుణంలో ఎండలు సాధారణం కంటే ఎక్కువగానే ఉండనున్నాయి. దీనికి తోడు మే నెలలో బంగాళాఖాతంలో ఏర్పడే తుపాన్లు బర్మా లేదా బంగ్లాదేశ్ వైపుగా వెళ్లడం జరిగితే వడగాల్పులు ఉండటం సాధారణం. మరి ఈ సారి ఎలా ఉండనుందో చూడాలి’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.