Breaking News: ముగిసిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

ABP Desam Last Updated: 14 Nov 2021 10:02 PM

Background

ఆగ్నేయ, తూర్పు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది దక్షిణ అండమాన్ తీరంలో శనివారం మొదలైంది. నవంబర్ 15 నాటికి ఇది తీవ్రరూపం దాల్చి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తాజా అల్పపీడనం తుపానుగా మారనుందని,...More

ముగిసిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం

తిరుపతిలో సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం ముగిసింది. విందు అనంతరం తాజ్ హోటల్ నుంచి ఏపీ సీఎం జగన్, కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై, పుదుచ్చేరి సీఎం రంగస్వామి, తమిళనాడు మంత్రి పొన్నుమూడి, కేరళ మంత్రులు, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్, అండమాన్ లెఫ్టినెంట్ గవర్నర్ డీకే జోషి, లక్ష్యద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ తిరుగుపయమయ్యారు. ఈ రాత్రికి తిరుపతిలోని తాజ్ హోటల్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బసచేయనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు తాజ్ హోటల్ లో ఏపీ బీజేపీ నేతలతో అమిత్ షా సమావేశం అవ్వనున్నారు. ఏపీలో పార్టీ బలోపేతంపై జాతీయ నాయకులతో అమిత్ షా చర్చించనున్నారు.