Breaking News Live: తిరుపతి ఐఐటీలో కరోనా కలకలం... 40 మంది విద్యార్థులకు పాజిటివ్..!
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్డేట్స్, వివరాలు మీకోసం
ABP Desam Last Updated: 22 Jan 2022 10:01 PM
Background
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత బాగా పెరిగింది. ఇటీవల కొన్ని రోజులపాటు వర్షాలు కురవడమే అందుకు కారణం. తాజాగా ఏపీలో వాతావరణం పొడిగా మారనుంది. వర్షాలు తగ్గినా కనిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం అలాగే ఉన్నాయి. తెలంగాణను దట్టమైన మేఘాలు కమ్మేశాయి. మరోవైపు...More
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత బాగా పెరిగింది. ఇటీవల కొన్ని రోజులపాటు వర్షాలు కురవడమే అందుకు కారణం. తాజాగా ఏపీలో వాతావరణం పొడిగా మారనుంది. వర్షాలు తగ్గినా కనిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం అలాగే ఉన్నాయి. తెలంగాణను దట్టమైన మేఘాలు కమ్మేశాయి. మరోవైపు కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతుండటంతో చలి తీవ్రత తగ్గడం లేదని వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో అకాల వర్షాలు మళ్లీ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం వాతావరణం పొడిగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర వెల్లడించింది. తెలంగాణను దట్టమైన మేఘాలు కమ్మేస్తున్నాయి. రేపటి నుంచి రెండు రోజులపాటు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. నేడు హైదరాబాద్, పలు జిల్లాల్లో చాలా చోట్ల వాతావరణం పొడిగా ఉండనుంది.ఉత్తర కోస్తాంధ్రలో నేడు, రేపు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లడానికి ఎలాంటి సమస్య ఉండదని అధికారులు సూచించారు. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలోనూ నేడు వర్షాలు కురిసే అవకాశం లేదని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నేటి నుంచి రెండు రోజులపాటు రాయలసీమలో వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. బంగార ధర వరుసగా మూడో రోజు పుంజుకుంది. మరోవైపు వెండి ధర కూడా భారీగా పెరిగింది. తాజాగా హైదరాబాద్లో రూ.100 మేర పెరగడంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,650 అయింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం రూ.49,800గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర రూ.500 మేర పెరగడంతో హైదరాబాద్ మార్కెట్లో కిలో రూ.69,300 అయింది.ఏపీ మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,800 అయింది. 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.45,650 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. వెండి 1 కిలోగ్రాము ధర రూ.69,300కు ఎగబాకింది. ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్లో బంగారం ధర పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,800 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,650 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.హైదరాబాద్లో గత ఏడాది డిసెంబర్ రెండో వారం నుంచి ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20 వద్ద ఉండగా.. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇంధన ధరలు ఇలా..విజయవాడలో పెట్రోల్పై 16 పైసలు పెరిగి లీటర్ ధర రూ.110.51 అయింది. ఇక్కడ డీజిల్ పై 15 పెరగడంతో లీటర్ ధర రూ.96.59 అయింది. అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉన్నాయి. విశాఖపట్నం మార్కెట్లో పెట్రోల్ ధర 0.31 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.109.36 అయింది. డీజిల్ పై 0.29 పైసలు పెరగడంతో విశాఖపట్నంలో డీజిల్ ధర లీటర్ రూ.95.47 కు చేరింది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
తిరుపతి ఐఐటీలో కరోనా కలకలం
తిరుపతి ఐఐటీలో కరోనా కలకలం రేగింది. నలభై మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. హాస్టల్లో ప్రస్తుతానికి 170 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. హాస్టల్ ను ఐసోలేషన్ సెంటర్ గా మార్చినట్లు తెలుస్తోంది.