Breaking News Live: విద్యార్థులకు అలర్ట్.. ఈ నెల 17 నుంచి 31 వరకు ఆన్ లైన్ క్లాసులు
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్డేట్స్, వివరాలు మీకోసం
ABP DesamLast Updated: 15 Jan 2022 03:00 PM

Background
నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మరికొన్ని రోజులు వర్షాలు కురవనున్నాయి. ఏపీలో నేటి నుంచి మరో మూడు రోజులపాటు...More
నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మరికొన్ని రోజులు వర్షాలు కురవనున్నాయి. ఏపీలో నేటి నుంచి మరో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణలో గత ఐదు రోజులుగా వర్షాలు కురుస్తుండగా.. ఏపీలో గత మూడు రోజులుగా కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. వర్షాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో చలి ప్రభావం పెరిగింది.కోస్తాంధ్ర, యానాంలో జనవరి 17వ తేదీ వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. వారానికి పైగా వర్ష సూచన నేపథ్యంలో వాతావరణ కేంద్రం రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దక్షిణ కోస్తాంధ్రలో కనిష్ట ఉష్ణోగ్రతలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నేడు సైతం తేలికపాటి జల్లులు కురవనున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో జనవరి 18 వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు కురవనున్నాయి. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.తెలంగాణ వెదర్ అప్డేట్..గత ఐదు రోజులుగా తెలంగాణలో పలు జిల్లాల్లో వానలు పడుతున్నాయి. ఉరుములు, మెరుపులతో తెలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు జనవరి 17 వరకు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర వెల్లడించింది. మరి కొన్ని రోజులపాటు వర్ష సూచన నేపథ్యంలో వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా చూస్తే బంగార ధర వరుసగా మూడో రోజు పుంజుకుంది. మరోవైపు వెండి ధర పడిపోయింది. తాజాగా హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,000 అయింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం రూ.49,100గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర రూ.100 మేర తగ్గడంతో హైదరాబాద్ మార్కెట్లో కిలో రూ.65,900కి దిగొచ్చింది.ఏపీ మార్కెట్లో బంగారం ధర నిన్న సాయంత్రం రూ.200 మేర పెరిగింది. విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,100 అయింది. 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.45,000కు చేరుకుంది. వెండి 1 కిలోగ్రాము ధర రూ.65,900 వద్ద మార్కెట్ అవుతోంది. ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్లో బంగారం ధర తగ్గడంతో 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,100 అయింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.హైదరాబాద్లో గత ఏడాది డిసెంబర్ రెండో వారం నుంచి ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి.పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20 వద్ద ఉండగా.. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఇక వరంగల్లో పెట్రోల్ ధర 27 పైసలు తగ్గగా లీటర్ ధర రూ.107.69 అయింది. డీజిల్పై 25 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.94.14 కి పతనమైంది. వరంగల్ రూరల్ జిల్లాలో పెట్రోల్ లీటర్ ధర రూ.107.92 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.94.35గా ఉంది.ఆంధ్రప్రదేశ్లో ఇంధన ధరలు ఇలా..ఇక విజయవాడలో పెట్రోల్ లీటర్ ధర రూ.110.32 అయింది. ఇక్కడ డీజిల్ ధర రూ.96.41కి తగ్గింది. అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉన్నాయి. విశాఖపట్నం మార్కెట్లో పెట్రోల్ ధర 0.35 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.109.40 అయింది. డీజిల్ ధర 0.33 పైసలు పెరగడంతో విశాఖపట్నంలో డీజిల్ ధర లీటర్ రూ.95.51 కు చేరింది.Also Read: Gold Silver Price Today: మళ్లీ భగ్గుమన్న బంగారం ధర.. స్వల్పంగా తగ్గిన వెండి.. లేటెస్ట్ రేట్లు ఇవే..Also Read: Hyderabad: దేశంలోనే హైదరాబాద్ టాప్.. పదేళ్లలో ఎంత మార్పో..! కేంద్రం తాజా నివేదికలో స్పష్టంAlso Read: బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్, ఉపకారవేతనాలు వెంటనే చెల్లించాలిఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
మంచిర్యాలలో విషాదం.. గాలిపటం మాంజాతో గొంతు తెగి వ్యక్తి మృతి
మంచిర్యాలలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తి మృతి చెందాడు. అతడి భార్యతో కలిసి వెళ్తున్న సమయంలో గాలిపటం ఎగరేసేందుకు వినియోగించిన మంజా దారం దారికి అడ్డంగా ఉంది. అది కనిపించని వాహనదారుడు అలాగే వెళ్లాడు. దారం కారణంగా వ్యక్తి గొంతుకు కోసుకుపోయింది. అతడి గొంతు తెగి తీవ్ర రక్తస్రావమైంది. ఘటన స్థలంలోనే ప్రాణాలు వదిలాడు.