Breaking News Telugu Live Updates: రాజన్న సిరిసిల్ల జిల్లాలో వార్డ్ మెంబర్ నాలుక కోసిన దుండగులు  

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 30 May 2022 10:09 PM

Background

నైరుతి రుతుపవనాలు సాధారణంగా జూన్ తొలి వారంలో కేరళ తీరాన్ని తాకుతాయి. ఈసారి మూడు రోజుల ముందుగానే కేరళలో ప్రవేశించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇటీవల మే 27న కేరళకు రుతుపవనాలు చేరుకుంటాయని ఐఎండీ అంచనా వేసింది. అయితే ఆ సమయానికి...More

రాజన్న సిరిసిల్లలో వార్డ్ మెంబర్ నాలుక కోసిన దుండగులు  

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో వార్డ్ మెంబర్ జవ్వాజి లింగంపై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. నాలుక కోసి, కత్తులతో దాడికి పాల్పడ్డారు. తీవ్రగాయల పాలైన లింగం ను స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. జవ్వాజి లింగంపై ఎవరు దాడి చేశారన్న పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలిసులు కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.