Breaking News Live: హైదరాబాద్ లో దారుణం.. యువతిని 18 సార్లు కత్తితో పొడిచిన ప్రేమోన్మాది
ఏపీ, తెలంగాణ సహా అంతర్జాతీయంగా నేడు జరిగే బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
ABP DesamLast Updated: 10 Nov 2021 06:51 PM

Background
హుజూరాబాద్ ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో గెలిచిన మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ నేడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈరోజు ఉదయం 11.30 గంటలకు ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ ప్రమాణస్వీకారం చేస్తారు. తెలంగాణ అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో...More
హుజూరాబాద్ ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో గెలిచిన మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ నేడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈరోజు ఉదయం 11.30 గంటలకు ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ ప్రమాణస్వీకారం చేస్తారు. తెలంగాణ అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుంది. ఈటల రాజేందర్ 7వ సారి ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. అనంతరం ఈటల మీడియాతో మాట్లాడతారు. జూన్ 12 న ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.ఆస్పత్రిలో యువతి ఆత్మహత్యఆరోగ్య సమస్య కోసం ఆసుపత్రికి వెళ్లిన యువతి అక్కడే ఆత్మహత్యకు పాల్పడింది. మరో నాలుగైదు గంటల్లో ఇంటికి వెళ్లాల్సి ఉండగా ఉరేసుకుంది. రాజేంద్రనగర్ పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు నెల్లూరు నగరానికి చెందిన సుదీప్తి అనే 27 ఏళ్ల యువతి.. బండ్లగూడజాగీర్లోని అపార్ట్మెంట్లో ఉంటోంది. ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా పనిచేస్తోంది. ఈ నెల 6న అనారోగ్యంతో స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లింది. మూడు రోజులుగా చికిత్స తీసుకుంటూ పూర్తిగా కోలుకుంది. మంగళవారం మధ్యాహ్నం డిశ్ఛార్జి కావాల్సి ఉండగా.. ఉదయం 9 గంటల సమయంలో ఆమె గదిలోకి నర్సు వెళ్లగా లోపలి నుంచి తలుపు లాక్ చేసి ఉంది. తలుపులు బద్దలు కొట్టి లోపలికెళ్లి చూడగా.. సుదీప్తి ఫ్యానుకు ఉరి వేసుకొని ఉంది. దీంతో ఆసుపత్రి నిర్వహకులు రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు.Also Read : అర్ధనగ్న స్థితిలో మహిళా డాన్సర్ మృతి.. పక్కనే బీరు బాటిల్22వ రోజుకు షర్మిల ప్రజా ప్రస్థానయాత్రవైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర 22వ రోజుకు చేరుకుంది. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో మంగళవారం నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చౌడంపల్లిలో ఆమె పాదయాత్ర చేశారు. నేడు నకిరేకల్ నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగనుంది. ఉదయం 10 గంటలకు నార్కట్ పల్లి మండలం కొడపాక గూడెం నుంచి షర్మిల పాదయాత్ర మొదలవుతుంది. అనంతరం సాయంత్రం 4 గంటలకు నెమ్మాని గ్రామంలో మాట ముచ్చట కార్యక్రమంలో షర్మిల పాల్గొంటారు.Also Read: RGIA Hyderabad: శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత... బట్టల్లో చుట్టి తరలిస్తున్న ప్రయాణికుడుAlso Read: Nalgonda: గుడిలో పూజారి.. చేసింది మాత్రం పాడు పని.. భార్య కూడా సహకారం, షాక్ అయిన పోలీసులుఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
హైదరాబాద్ లో దారుణం.. యువతిని 18 సార్లు కత్తితో పొడిచిన ప్రమోన్మాది
హైదరాబాద్ లో దారుణం జరిగింది. యువతిని ఓ ప్రమోన్మాది కత్తితో పొడిచాడు. ఎల్ బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. శిరీష అనే యువతిపై ఓ ప్రేమోన్మాది కత్తితోదాడి చేశడు. శిరీష పరిస్థితి విషమం నవీన హాస్పిటల్ కి తరలించారు. నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రేమించి పెళ్లికి నిరాకరించిందని యువతిపై బస్వరాజ్ అనే వ్యక్తి కత్తితో దాడి చేసినట్టు తెలిసింది.