Breaking News Live:తెలంగాణలో కోవిడ్ ఆంక్షల పొడిగింపు
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
ABP Desam Last Updated: 09 Jan 2022 10:15 PM
Background
హెలికాప్టర్కు తప్పిన ముప్పుఒడిశాలో ఓ హెలికాప్టర్కు పెను ప్రమాదం తప్పింది. హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన ఒడిశాలోని గజపతి జిల్లాలో చోటుచేసుకుంది. శనివారం సాయంత్రం పరలఖేమండిలో ఉన్న స్టేడియంలో...More
హెలికాప్టర్కు తప్పిన ముప్పుఒడిశాలో ఓ హెలికాప్టర్కు పెను ప్రమాదం తప్పింది. హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన ఒడిశాలోని గజపతి జిల్లాలో చోటుచేసుకుంది. శనివారం సాయంత్రం పరలఖేమండిలో ఉన్న స్టేడియంలో పిల్లలు క్రికెట్ ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ హెలికాప్టర్ అతి తక్కువ ఎత్తులో ఎగురుతుండటాన్ని వారు గమనించారు. అది మెల్లగా తాము ఆడుకుంటున్న గ్రౌండ్లోనే కిందికి దిగుతున్నదనది గుర్తించారు. దీంతో భయపడిన చిన్నారులు ఎక్కడివారు అక్కడ పారిపోయారు. అయితే హెలికాప్టర్ అత్యవసరంగా ఎందుకు దిగిందనే విషయం ఇంకా తెలియరాలేదు. ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తిందా లేదా మరేదైనా కారణం ఉందా అనే విషయంపై వాయుసేన అధికారులు విచారణ ప్రారంభించారు.హైదరాబాద్లో పెట్రోల్ డీజిల్ ధరలు గత కొద్ది రోజులుగా నిలకడగానే ఉంటున్నాయి. నేడు కూడా పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా.. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే కొనసాగుతోంది. ఇక వరంగల్లోనూ గత ఐదు రోజులుగా పెట్రోల్ ధరలు స్థిరంగానే ఉంటున్నాయి. నేడు (జనవరి 9) కూడా పాత ధరలే కొనసాగుతున్నాయి. పెట్రోల్ రూ.107.69 గా ఉండగా.. డీజిల్ ధర కూడా అలాగే రూ.94.14 గా కొనసాగుతోంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.నిజామాబాద్లో ఇంధన ధరలు నేడు కాస్త తగ్గాయి. పెట్రోల్ ధర లీటరుకు నేడు రూ.0.43 పైసలు పెరిగి రూ.110.46 గా ఉంది. డీజిల్ ధర రూ.0.40 పైసలు పెరిగి రూ.96.72 గా ఉంది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా కనిపిస్తుండగా తాజాగా స్వల్పంగా తగ్గాయి.ఆంధ్రప్రదేశ్లో ఇంధన ధరలు ఇలా..విజయవాడ మార్కెట్లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.0.21 పైసలు పెరిగి రూ.110.29గా ఉంది. డీజిల్ ధర బెజవాడలో రూ.0.17 పైసలు పెరిగి రూ.96.36 గా ఉంది.వాతావరణంఏపీ, తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు మళ్లీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చలి తీవ్రత తగ్గినట్లు కనిపించి రెండు రోజులుగా పెరుగుతోంది. తెలంగాణలో మూడు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. ఈశాన్య, తూర్పు దిశల నుంచి గాలులు ఏపీలో తక్కువ ఎత్తులో వీస్తున్నాయిని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ఫలితంగా కోస్తాంధ్ర, యానాంలో నేటి నుంచి మరో రెండు రోజులపాటు వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గడంతో కొన్నిచోట్ల చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగిన ప్రాంతాల్లో చలి ప్రభావం అంతగా కనిపించడం లేదని వాతావరణ కేంద్రం తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లడానికి ఇబ్బంది లేదని వాతావరణ కేంద్రం సూచించింది.బంగారం, వెండి ధరలుతెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు నిలకడగా ఉంది. వెండి ధర మాత్రం స్వల్పంగా రూ.0.10 పైసలు పెరిగి.. కిలోకు రూ.100 మార్పు కనిపించింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో రూ.44,600 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.48,650 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో కిలో రూ.64,600గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.ఇక విశాఖపట్నం మార్కెట్లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,600 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,650గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.64,600 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర తగ్గింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.44,600 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.48,650గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.64,600గా ఉంది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ఏనుడు దాడిలో ట్రాకర్ మృతి
విజయనగరం జిల్లా కొమరాడ మండలంలో దుగ్గి గ్రామంలో ఏనుగు దాడిలో ట్రాకర్ మృతి చెందాడు. దుగ్గి గ్రామానికి సమీపంలోకి ఏనుగు రావడంతో ఏనుగును అడవిలోకి తోలేందుకు ట్రాకర్ రాజు ప్రయత్నించాడు. ఏనుగు ఎదురు దాడికి దిగటంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. మృతుడు రాజు శ్రీకాకుళం జిల్లా చెందిన వాడు.