Breaking News Live: గుంటూరు జిన్నా టవర్ వద్ద జాతీయ జెండా ఎగురవేస్తాం : వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 31 Jan 2022 06:10 PM

Background

అల్పపీడన ద్రోణి దక్షిణ తమిళనాడు నుంచి రాయలసీమ వరకు సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది.  తక్కువ ఎత్తులో ఈశాన్య దిశ నుంచి బలమైన గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా నేడు ఏపీలో వాతావరణం పొడిగా మారుతుందని...More

గుంటూరు జిన్నా టవర్ వద్ద జాతీయ జెండా ఎగురవేస్తాం : వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా 

గుంటూరు జిన్నా టవర్ వద్ద జాతీయ జెండా ఎగురవేయాలని నిర్ణయించామని ఎమ్మెల్యే ముస్తఫా అన్నారు. జాతీయ జెండా ఎగుర వేసే సమయంలో అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానం పలుకుతామన్నారు. కులం, మతం, ప్రాంతం చూడకుండా అందరి అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వ విధానం పాటుపడుతుందని ఎమ్మె్ల్యే ముస్తఫా అన్నారు. రాజకీయ లబ్ది కోసం  కొన్ని పార్టీలు ఏవేవో చేస్తున్నాయన్నారు. భారతదేశం కోసం ఎందరో ముస్లిం సోదరులు ప్రాణాలు అర్పించారన్నారు. గుంటూరు పట్టణంలోని జిన్నా టవర్ ను ఎమ్మెల్యే ముస్తఫా, మేయర్ మనోహర్ పరిశీలించారు.