Breaking News Live: పెందుర్తి భూకబ్జా వ్యవహరం.. వైసీపీ నేత దొడ్డి కిరణ్ అరెస్టు
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
ABP Desam Last Updated: 30 Jan 2022 09:41 PM
Background
ఏపీలో నేడు, రేపు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. అదే సమయంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా నమోదవుతాయని తెలిపారు. వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా తక్కువ ఎత్తులో ఈశాన్య...More
ఏపీలో నేడు, రేపు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. అదే సమయంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా నమోదవుతాయని తెలిపారు. వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా తక్కువ ఎత్తులో ఈశాన్య గాలులు వీస్తున్నాయి. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకూ సాధారణంగా కంటే మరింత తక్కువగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాలు సహా.. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో రాగల మూడు రోజులు వాతావరణం పొడిగా ఉంటుంది. ప్రస్తుతం తక్కువ ఎత్తులో వీస్తున్న ఈశాన్య గాలుల ప్రభావంతో రాష్ట్రమంతా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. తెలంగాణలో ఇలా..హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. రాష్ట్రమంతా ఎలాంటి వర్ష సూచన లేదు. వాతావరణం పొడిగానే ఉంటుంది. కానీ, రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ వివరాలపై ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ కూడా కీలక అంచనాలను వెల్లడించారు. శీతల గాలుల ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో చలి అధికంగా ఉంటుందని చెప్పారు. ‘‘విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత తీవ్రంగా ఉంటుంది. ఈ చలి తెల్లవారిజామున సమయంలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోకి విస్తరిస్తుంది కాబట్టి చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మరో వైపున విశాఖ నగరంలో సాధారణంగానే చలి ఉంటుంది.తెలంగాణ రాష్ట్రం మొత్తం చలి తీవ్రత విపరీతంగా ఉంటుంది. వాటి ప్రభావం వల్ల గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో తెలంగాణకి ఎంత దగ్గరగా మీ ప్రదేశం ఉంటుందో అంత చల్లగా ఉంటుంది. అనంతపురం, చిత్తూరు కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. రాయలసీమ మిగిలిన భాగాల్లో చలి కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో సాధారణంగానే చల్ ఉంటుంది. కర్నూలు జిల్లాలో మాత్రం నంధ్యాల డివిజన్ లో చలి తీవ్రంగా ఉంటుంది.’’ అని ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ ఫేస్ బుక్లో పోస్టు చేశారు.బంగారం, వెండి ధరలుతెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర వరుసగా నేడు తగ్గింది. తులానికి ఏకంగా రూ.150 తగ్గింది. వెండి ధర కిలోకు రూ.800 తగ్గుదల కనిపించింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో రూ.45,000 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.49,100 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో కిలోకు రూ.800 తగ్గి రూ.65,500గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.ఇక విశాఖపట్నం మార్కెట్లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,000 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,100గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.65,500 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర తగ్గింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.45,000 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.49,100గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.65,500గా ఉంది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
పెందుర్తి భూకబ్జా వ్యవహరం.. వైసీపీ నేత దొడ్డి కిరణ్ అరెస్టు
విశాఖ పెందుర్తి భూకబ్జా ఘటనలో రెవెన్యూ ఉద్యోగులపై దాడి చేసిన వైసీపీ నేత దొడ్డి కిరణ్ ను అరెస్ట్ చేశారు. రాజమండ్రిలో దొడ్డి కిరణ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అరెస్టును పోలీసులు ఇంకా నిర్థారించలేదు. పెందుర్తిలో 80 సెంట్ల భూమి కబ్జా కోసం ప్రయత్నించిన్నట్టు దొడ్డి కిరణ్ పై ఆరోపణలు ఉన్నాయి.