Breaking News Live: శంషాబాద్ లో మద్యం మత్తులో కారు నడిపిన యువతి.. ముగ్గురికి తీవ్రగాయాలు 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 27 Jan 2022 06:15 PM

Background

ఏపీలో నేడు, రేపు వర్ష సూచన ఉన్నట్లుగా అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. నిన్న దక్షిణ తమిళనాడు నుంచి రాయలసీ వరకూ సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తు వరకూ...More

శంషాబాద్ లో మద్యం మత్తులో కారు నడిపిన యువతి.. ముగ్గురికి తీవ్రగాయాలు 

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు నడిపిన ఓ యువతి రోడ్డుపై వెళ్తున్న వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కారును స్థానికులు అడ్డుకోవడంతో వారితో యువతి, కారులోని మరో వ్యక్తి వాగ్వాదానికి దిగారు.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి చేరుకుని మద్యం మత్తులో ఉన్న యువతి, ఆమెతో ఉన్న వ్యక్తిని పోలీసు స్టేషన్ కు తరలించారు. కారులో ఉన్న వారు మద్యం తాగినట్లు బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్షలో తేలిందని పోలీసులు పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.