= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
శంషాబాద్ లో మద్యం మత్తులో కారు నడిపిన యువతి.. ముగ్గురికి తీవ్రగాయాలు రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు నడిపిన ఓ యువతి రోడ్డుపై వెళ్తున్న వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కారును స్థానికులు అడ్డుకోవడంతో వారితో యువతి, కారులోని మరో వ్యక్తి వాగ్వాదానికి దిగారు.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి చేరుకుని మద్యం మత్తులో ఉన్న యువతి, ఆమెతో ఉన్న వ్యక్తిని పోలీసు స్టేషన్ కు తరలించారు. కారులో ఉన్న వారు మద్యం తాగినట్లు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో తేలిందని పోలీసులు పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతించిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతించారు. అయితే హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. జిల్లాల ఏర్పాటును రాజకీయం చేయొద్దని ఆయన కోరారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డికి కరోనా పాజిటివ్ తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి కరోనా సోకింది. కరోనా స్వల్ప లక్షణాలు ఉన్నాయని, హోంఐసోలేషన్ లో ఉన్నానని ఆయన స్వయంగా ప్రకటించారు. ఇటీవల తనను కలిసిన వాళ్లు కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ఎమ్మెల్సీ కవితతో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి భేటీ నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. తనను జిల్లా అధ్యక్షుడిగా నియమించిన ముఖ్యమంత్రి కేసీఆర్కి, సహకరించిన ఎమ్మెల్సీ కవితకు ధన్యవాదాలు తెలిపారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
పాత రథం చక్రాల దగ్దంపై అధికారుల వివరణ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో పాత రథం చక్రాల దగ్దంపై ఆలయ అసిస్టెంట్ కమీషనర్ కుసుమ వివరణ ఇచ్చారు.. కాణిపాకం ఆలయంలో ఆస్తులు, రధాలు భధ్రంగా ఉన్నాయని, ఆలయంలో నిర్వహించే కార్యక్రమాల తరువాత సంబంధిత షెడ్లల్లో పెట్టి జాగ్రత్త పరిచామని ఆలయ ఏసీ కుసుమ వెల్లడించారు.. దేవస్ధానం ఆస్తులకు ఎటువంటి నష్టం జరగలేదన్నారు.. దేవస్ధానంకు అర్ధ కిలో మీటరు దూరంలోని అనవసర వస్తువులు భద్ర పరుచు గ్యారేజ్ లో ఉపయోగంలో లేని ఇనుప వస్తువులు, కొయ్యలు నిల్వ ఉంచామని, చెత్త సేకరించే కొందరు ఇనుప కడ్డీల కోసం తుప్పు పట్టిన రధం చక్రాలకు నిప్పు అంటించడం జరిగిందన్నారు.. దీనిని గమనించిన ఆలయ సెక్యూరిటీ సిబ్బంది వేంటనే స్పందించి నిప్పును ఆర్పి వేయడం జరిగిందని, దేవస్ధానం ఆస్తులకు ఎటువంటి నష్టం జరగలేదని ఆమె వెల్లడించారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
డ్రగ్స్ కేసులో కీలక పరిణామం హైదరాబాద్ డ్రగ్స్ కేసులో మరో 15 మంది వ్యాపారవేత్తలను టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. టోనీ దగ్గర నుంచి వ్యాపారవేత్తలు కొన్నేళ్లుగా డ్రగ్స్ను కొనుగోలు చేస్తున్నారు. వందల కోట్ల డ్రగ్స్ వ్యాపారం చేసిన అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ టోనీ... లావాదేవీలన్నీ డార్క్ వెబ్ సైట్ ద్వారా నిర్వహించినట్టు పోలీసులు గుర్తించారు. టోనీ తన సెల్ ఫోన్లో ఉన్న డేటాను, వాట్సాప్ చాటింగ్లను ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తున్నాడు. టోనీకి సంబంధించిన రెండు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
అన్నపై తమ్ముడు కత్తితో దాడి హైదరాబాద్లో ఇద్దరు అన్నాదమ్ముళ్ల మధ్య చిన్న విషయంలో గొడవ ప్రాణాలు తీసుకొనే వరకూ వెళ్లింది. అన్నపై తమ్ముడు కత్తితో దాడిచేశాడు. నగరంలోని జమాల్బండ ప్రాంతానికి చెందిన జావిద్ (26), ఆసిఫ్ అన్నాదమ్ములు. వీరు ఫంక్షన్హాల్లో పనిచేస్తుంటారు. వీరు సెల్ఫోన్ విషయంలో గొడవ పడ్డారు. కోపోద్రిక్తుడైన తమ్ముడు ఆసిఫ్ అన్న జావిద్పై కత్తితో దాడిచేశాడు. అక్కడే ఉన్న కొంత మంది గాయపడ్డ జావిద్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. జావిద్కు స్వల్ప గాయాలయ్యాయని, కేసు దర్యాప్తు చేస్తున్నామని చాంద్రాయణ గుట్ట పోలీసులు తెలిపారు.