Breaking News Live: నిర్మల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఘటన స్థలంలోనే ముగ్గురు మృతి
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
ABP Desam Last Updated: 19 Jan 2022 03:55 PM
Background
ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాత, వైఎస్ఆర్ సీపీ నేత ప్రసాద్ వి.పొట్లూరి (పీవీపీ)పై హైదరాబాద్లో కేసు నమోదు అయింది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కుమార్తె ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు పీవీపీపై కేసు పెట్టారు. తన ఇంటి గోడను...More
ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాత, వైఎస్ఆర్ సీపీ నేత ప్రసాద్ వి.పొట్లూరి (పీవీపీ)పై హైదరాబాద్లో కేసు నమోదు అయింది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కుమార్తె ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు పీవీపీపై కేసు పెట్టారు. తన ఇంటి గోడను పీవీపీ అనుచరులు బలవంతంగా కూలగొట్టించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా పోలీసులు వెల్లడించారు. పీవీపీ అనుచరులు తమపై వేధింపులకు పాల్పడుతున్నారని డీకే అరుణ కుమార్తె శ్రుతి రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నంబర్ - 7లో ఓ విల్లాను డీకే అరుణ కుమార్తె శ్రుతి రెడ్డి కొనుగోలు చేశారు. ఆ ఇంటికి మరమ్మతులు చేయించడంలో భాగంగా ప్రహరీ నిర్మాణం చేపట్టారు. అయితే శ్రుతి రెడ్డి ఇంట్లోకి ప్రవేశించి ప్రహరి గోడతో పాటు రేకులను కూడా పీవీపీ అనుచరుడు బాలాజీ, ఇంకొంత మంది ఆయన అనుచరులు జేసీబీతో కూల్చేయించారని శ్రుతి రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదేంటని నిలదీసినందుకు శ్రుతి రెడ్డిపై వారు బెదిరింపులకు పాల్పడినట్లుగా చెప్పారు. దీంతో పీవీపీతో పాటు సంఘటన స్థలంలో ఉన్న బాలాజీ, అతనికి సహకరించిన మరికొందరిపై కేసు నమోదు చేసినట్లుగా బంజారాహిల్స్ పోలీసులు వెల్లడించారు.బంగారం ధరలుతెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు అతి స్వల్పంగా గ్రాముకు రూ.2 తగ్గింది. కానీ వెండి ధర మాత్రం కిలోకు రూ.300 పెరిగింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో రూ.44,970 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.49,070 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో కిలోకు రూ.300 పెరిగి రూ.65,800గా అయింది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.ఇక విశాఖపట్నం మార్కెట్లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,970 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,070గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.65,800 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర నిలకడగానే ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.44,970 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.49,070గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.65,800గానే ఉంది.పెట్రోల్, డీజిల్ ధరలుహైదరాబాద్లో పెట్రోల్ డీజిల్ ధరలు గత కొద్ది నెలలుగా నిలకడగానే ఉంటున్నాయి. నేడు కూడా పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా.. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే కొనసాగుతోంది. ఇక వరంగల్లోనూ గత కొద్ది రోజులుగా పెట్రోల్ ధరలు స్థిరంగా ఉంటుండగా.. నేడు (జనవరి 19) స్థిరంగా ఉన్నాయి. పెట్రోల్ ధర రూ.0.19 పైసలు పెరిగి రూ.107.69 గా ఉండగా.. డీజిల్ ధర రూ.0.17 పైసలు పెరిగి రూ.94.31 గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి. నిజామాబాద్లో ఇంధన ధరలు నేడు కాస్త తగ్గాయి. పెట్రోల్ ధర లీటరుకు నేడు రూ.0.17 పైసలు తగ్గి రూ.109.76 గా ఉంది. డీజిల్ ధర రూ.0.16 పైసలు తగ్గి రూ.96.07 గా ఉంది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా కనిపిస్తుండగా తాజాగా స్వల్పంగా తగ్గాయి.ఆంధ్రప్రదేశ్లో ఇంధన ధరలు ఇలా..విజయవాడ మార్కెట్లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.0.08 పైసలు పెరిగి రూ.110.37గా ఉంది. డీజిల్ ధర బెజవాడలో రూ.0.08 పైసలు పెరిగి రూ.96.44 గా ఉంది. ఇక విశాఖపట్నం మార్కెట్లో పెట్రోల్ ధర నేడు కాస్త ఎక్కువే పెరిగింది. లీటరు ధర రూ.0.60 పైసలు పెరిగి రూ.109.65 గా ఉంది. డీజిల్ ధర రూ.0.56 పైసలు పెరిగి రూ.95.74గా ఉంది. అయితే, ఇక్కడి కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
నిర్మల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఘటన స్థలంలోనే ముగ్గురు మృతి
నిర్మల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు సంఘటనా స్థలంలోనే మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కడెం నుంచి బోర్ణపల్లి వైపు ఆరుగురు ప్రయాణికులతో వెళ్తున్న ఆటో ఒక్కసారిగా అదుపు తప్పి కాలువలోకి వెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వైద్య చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నారు.