Breaking News Live: పెందుర్తి భూకబ్జా కేసు, వైసీపీ నేత దొడ్డి కిరణ్ అరెస్టు
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
విశాఖ పెందుర్తి, సత్తివానిపాలెం భూకబ్జా వివాదంలో రెవిన్యూ ఉద్యోగులపై దాడి దొడ్డి కిరణ్ గత వారం రోజుల క్రితం పరారయ్యాడు. ఎట్టకేలకు అతడ్ని పంజాబ్ అమృత్ సర్ లో విశాఖ పోలీసులు పట్టుకున్నారు. కిరణ్ ను దిల్లీ నుంచి విశాఖకు తీసుకొచ్చారు. అనంతరం పెందుర్తి స్టేషన్ కు తరలించారు. రేపు న్యాయస్థానంలో హాజరుపరిచే అవకాశం ఉంది. ఇప్పటికే భూకబ్జా కేసులో 4 గురిని అదుపులోకి తీసుకున్నారు. కిరణ్ తో పాటు పరారీలో ఉన్న డ్రైవర్ పవన్ ను పోలీసులు అరెస్టు చేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 9న విశాఖపట్నంలో పర్యటించనున్నారు. శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ఆహ్వానం మేరకు చినముషిరివాడలోని శారదా పీఠం వార్షికోత్సవంలో పాల్గొంటారు. 9వ తేదీ ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకొని అక్కడి నుంచి నేరుగా శారదా పీఠానికి రోడ్డు మార్గంలో చేరుకోనున్నారు. వార్షికోత్సవంలో భాగంగా పీఠంలో నిర్వహించే రాజశ్యామల యాగం, అగ్నిహోత్ర సభ, రుద్రయాగంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. అనంతరం ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడకు తిరుగు ప్రయాణం కానున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 9న విశాఖపట్నంలో పర్యటించనున్నారు. శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ఆహ్వానం మేరకు చినముషిరివాడలోని శారదా పీఠం వార్షికోత్సవంలో పాల్గొంటారు. 9వ తేదీ ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకొని అక్కడి నుంచి నేరుగా శారదా పీఠానికి రోడ్డు మార్గంలో చేరుకోనున్నారు. వార్షికోత్సవంలో భాగంగా పీఠంలో నిర్వహించే రాజశ్యామల యాగం, అగ్నిహోత్ర సభ, రుద్రయాగంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. అనంతరం ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడకు తిరుగు ప్రయాణం కానున్నారు.
తిరుపతిలోని సప్తగిరి నగర్ లో వింత చోటు చేసుకుంది. నిన్న అర్ధరాత్రి నుండి వేప చెట్టుకు పాలు కారుతున్నాయి.. చెట్టు నుండి పాలు కారడాన్ని గుర్తించిన స్థానికులు వేపచెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే ఈ వింత గురించి తెలుసుకున్న నగరవాసులు వేపచెట్టుకు పాలు కారడాన్ని చూసేందుకు భారీగా తరలివస్తున్నారు.. దేవుని మహిమ వల్లనే వేప చెట్టుకు పాలు కారుతున్నాయని, ఎగబడి మరి పాలను సేకరించి మొక్కుకుంటున్నారు స్థానికులు.
తిరుపతిలోని సప్తగిరి నగర్ లో వింత చోటు చేసుకుంది. నిన్న అర్ధరాత్రి నుంచి వేపచెట్టుకు పాలు కారుతున్నాయి. చెట్టు నుంచి పాలు కారడంను గుర్తించిన స్థానికులు వేపచెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే ఈ వింత గురించి తెలుసుకున్న నగరవాసులు వేపచెట్టుకు పాలు కారడాన్ని చూసేందుకు భారీగా తరలివస్తున్నారు. దేవుని మహిమ వల్లనే వేప చెట్టుకు పాలు కారుతున్నాయని, ఎగబడి మరి పాలను సేకరించి మొక్కుకుంటున్నారు స్థానికులు.
ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెళ్లనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 5న ప్రధాని మోదీ రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఆయనకు స్వాగతం పలికేందుకు స్వయంగా సీఎం కేసీఆర్ వెళ్లకుండా మంత్రిని పంపడం ప్రాధాన్యం సంతరించుకుంది.
మాజీ ముఖ్యమంత్రి డా.మర్రి చెన్నారెడ్డి మనవడు, మర్రి ఆదిత్యరెడ్డి, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. గత కొన్నేళ్లుగా మర్రి చెన్నారెడ్డి ఫౌండేషన్ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మర్రి ఆదిత్యరెడ్డి.. తాజాగా పూర్తి స్థాయి ప్రజా జీవితంలోకి ప్రవేశించారు.
- ప్రభుత్వ ఉద్యోగులను చర్చలకు రమ్మని పిలిచిన ప్రభుత్వ కమిటీ..
- చర్చలే పరిష్కారం.. సమ్మె కాదంటున్న ఏపీ సీఎస్..
- ఇవాళ పీఆర్సి సాధన సమితి స్టీరింగ్ కమిటీ సమావేశం
- ప్రభుత్వ కమిటీతో చర్చలపై నిర్ణయం
- సోమవారం నుంచి సమ్మె కు పిలుపు ఇచ్చిన ఉద్యోగులు
హిందూపురంలో పొట్టి శ్రీరాములు విగ్రహం వద్దకు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేరుకున్నారు. పొట్టిశ్రీరాములు విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకూ ఆయన మౌన ప్రదర్శన నిర్వహించారు. హిందూపురం జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ మద్దతు తెలిపేందుకు విద్యార్థులు భారీగా తరలివచ్చారు. పొట్టి శ్రీరాములు సర్కిల్లో ‘జై బాలయ్య.. జై బాలయ్య’ నినాదాలు మార్మోగాయి.
మంచిర్యాల జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సిలిండర్ పేలి రేకుల ఇల్లు పూర్తిగా ధ్వంసం అయింది. అయితే, ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం ఏమీ జరగలేదు. మంచిర్యాల జిల్లా వేమనపల్లి గ్రామానికి చెందిన ఆశాలు (38) రేకుల ఇల్లు.. గ్యాస్ సిలిండర్ పేలడంతో దగ్ధమైంది. ఇంట్లోని వారందరూ గ్రామంలోని ఓ పెళ్లికి హాజరైన సమయంలో ఈ ఘటన జరిగింది. ఆశాలు కుటుంబం ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో చిన్నపాటి రేకుల ఇల్లు నిర్మించుకుని అందులోనే ఉంటున్నారు. కుటుంబ సభ్యులంతా గ్రామంలో జరుగుతున్న పెళ్లికి వెళ్లిన సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వివరాలు సేకరించి కేసు నమోదు చేయనున్నట్లు నీల్వాయి ఎస్ఐ తెలిపారు.
Background
ఏపీ, తెలంగాణలో నేడు, రేపు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి, హైదరాబాద్లోని వాతావరణ కేంద్రాల అధికారులు వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు. అదే సమయంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపారు. అమరావతిలోని వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా తక్కువ ఎత్తులో నేడు నైరుతి దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకూ ఎలాంటి వర్షం ఉండబోదని వెల్లడించారు. అలాగే వాతావరణం పొడిగా ఉంటుందని అంచనా వేశారు.
ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. కనిష్ణ ఉష్ణోగ్రతలు నెమ్మదిగా పెరిగే అవకాశం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
‘‘ఉత్తరాంధ్ర జిల్లాలు ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో దట్టమైన పొగ మంచు విస్తరిస్తోంది. ముఖ్యంగా విశాఖ నగరం దగ్గరగా ఉండే ప్రదేశాల్లో ఎక్కువగా పొగ మంచు విస్తరిస్తోంది. మారేడుమిల్లి నుంచి వస్తున్న మేఘాలు తూర్పు గోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోకి విస్తరిస్తోంది. మరో వైపున అనంతపురం, చిత్తూరు జిల్లా పశ్చిమ భాగాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. అత్యల్పంగా అనంతపురం జిల్లా హిందూపురంలో 14.1 డిగ్రీలు నమోదయ్యింది.’’ అని ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.
తెలంగాణలో ఇలా..
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. రాష్ట్రమంతా ఎలాంటి వర్ష సూచన లేదు. వాతావరణం అంతా పొడిగానే ఉంటుంది. కానీ, రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితే మరో మూడు నాలుగు రోజులు ఉండనుందని అంచనా వేశారు.
హైదరాబాద్లో ఆకాశం నిర్మలంగా ఉంటుంది. ఉదయం సమయంలో కొన్ని చోట్ల పొగమంచు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 33 డిగ్రీలు, 19 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంటుంది. నైరుతి దిశ నుంచి ఉపరితల గాలులు గంటకు 6 కిలో మీటర్ల నుంచి 8 కిలో మీటర్ల వరకూ వీచే అవకాశం ఉంటుంది.
బంగారం, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు పెరిగింది. గ్రాముకు రూ.20 పెరిగి పది గ్రాములకు రూ.200 చొప్పున ఎగబాకింది. వెండి ధర నిలకడగా ఉంది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో రూ.45,100 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.49,200 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో కిలోకు రూ.65,600గా నిలకడగానే ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఇక విశాఖపట్నం మార్కెట్లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,100 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,200గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.65,600 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర తగ్గింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.45,100 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.49,200గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.65,600గా ఉంది.
- - - - - - - - - Advertisement - - - - - - - - -