Breaking News Live: పల్లె వెలుగు బస్సుల రంగులు మార్చాలని ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 06 Dec 2021 03:53 PM

Background

మానుకోటలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మాస్కు, హెల్మెట్ తప్పనిసరి అంటూ ఆదివారం మహబూబాబాద్ జిల్లా మానుకోటలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ వివాదాస్పదంగా మారింది. బైకర్ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ మండలానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి తన కూతురితో మహబూబాబాద్‌‌లో...More

పల్లె వెలుగు బస్సులు రంగులు మార్చాలని ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం

ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పల్లెవెలుగు బస్సులకు రంగులను మార్చాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏపీఎస్ ఆర్టీసీ ప్రధాన కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. అన్ని జిల్లాల్లోని పల్లెవెలుగు బస్సుల రంగులను మార్చాలని ఆదేశాలను జారీచేశారు.  ప్రస్తుతం పల్లెవెలుగు బస్సులకు ఆకుపచ్చ, పసుపు, తెలుపు, నలుపు రంగులు ఉన్నాయి. వీటిలో పసుపు రంగును మాత్రం తొలగించనున్నారు. పసుపు రంగు బదులుగా గచ్చకాయ రంగును వినియోగించబోతున్నారు. ఇదే సమయంలో డిజైన్ ను కూడా మార్చనున్నట్లు తెలుస్తోంది.