Breaking News Live: నరసాపురం ఎంపీ రఘురామ కేవలం ప్రెస్ మీట్లకే పరిమితం.. ఎంపీ భరత్ రామ్

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 28 Dec 2021 12:18 PM

Background

రైతు బంధు డబ్బులు నేటి నుంచి రైతుల ఖాతాల్లో పడనున్నాయి. యాసంగి సీజన్‌లో 66.61 లక్షల మంది రైతులకు, 152.91 లక్షల ఎకరాలకు, రూ.7,645.66 కోట్లు పంపిణీ చేయనున్నారు. ఎకరం భూమి ఉన్న రైతులకు 28న, రెండెకరాలు ఉన్న రైతులకు 29న,...More

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్

కడప జిల్లా: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. వివేకానంద రెడ్డి హత్య కేసులో వేరే వారి పేర్లను చెప్పాలని తనపై ఒత్తిడి పెరుగుతోందని.. పులివెందుల పోలీసులు, ఎస్పీలకు కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి వివేకా పీఏ కృష్ణారెడ్డి పులివెందుల కోర్టును ఆశ్రయించారు. కదిరి లాయర్ లోకేశ్వర్ రెడ్డి ద్వారా సీబీఐ ఏఎస్పీ అధికారి రామ్ సింగ్ పై పులివెందుల కోర్టులో ఫిర్యాదు చేశారు. వీరికి మద్దతుగా వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డిలు వేరే పేర్లు చెప్పాలని.. కేసు విచారణకు వచ్చిందని.. త్వరగా వేరే వారి పేర్లు చెప్పాలని ఒత్తిడి చేస్తున్నట్లుగా కృష్ణారెడ్డి చెప్పినట్లు లాయర్ లోకేశ్వర రెడ్డి, మరో కడప లాయర్ అనంత వర ప్రసాద్ మీడియాకు వెల్లడించారు.