హైదరాబాద్లోని పబ్స్, హోటళ్ల యజమానులకు హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. జూబ్లీహిల్స్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ధ్వని కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలని జూబ్లీహిల్స్ రెసిడెంట్స్ క్లీన్ అండ్ గ్రీన్ అసోసియేషన్, పలువురు అసోసియేషన్ సభ్యులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు....More
హైదరాబాద్లోని పబ్స్, హోటళ్ల యజమానులకు హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. జూబ్లీహిల్స్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ధ్వని కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలని జూబ్లీహిల్స్ రెసిడెంట్స్ క్లీన్ అండ్ గ్రీన్ అసోసియేషన్, పలువురు అసోసియేషన్ సభ్యులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. పబ్స్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్తోపాటు పలు పబ్స్, హోటల్స్ తదితర సంస్థలకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణ వచ్చేనెలకు వాయిదా పడింది.తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి విపరీతంగా పెరిగిపోతోంది. రాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం ఎండ కాసేంతవరకూ ఇళ్ల నుంచి బయటకు రావడానికి కూడా ఇబ్బంది జనం పడుతున్నారు. అత్యల్ప స్థాయిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వచ్చే ఐదు రోజులకు సంబంధించి హైదరాబాద్ వాతావరణ కేంద్రం రాష్ట్రంలో నెలకొనే వాతావరణ అంచనాలను విడుదల చేసింది. దీని ప్రకారం..డిసెంబరు 23న తెలంగాణలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. కానీ, ఉష్ణోగ్రతలు మాత్రం రాత్రి వేళ అత్యల్పంగా నమోదు కానున్నాయి. కొన్ని చోట్ల సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకూ తెలంగాణలో పొడి వాతావరణమే ఉండనుంది. చలికి సంబంధించి ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.ఏపీలో ఇలా..అమరావతిలోని వాతావరణ కేంద్రం ట్వీట్ చేసిన వివరాల ప్రకారం.. రాగల ఐదు రోజుల్లో ఉత్తర కోస్తా యానం ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుంది. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కూడా పొడి వాతావరణం ఉంటుంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుంది.తెలంగాణలో ఒమిక్రాన్ కలకలంతెలంగాణలో ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది. గత 24 గంటలలో తెలంగాణలో కొత్తగా 14 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 38కి చేరింది. 24 గంటల వ్యవధిలో ఎట్ రిస్క్ దేశాల నుంచి హైదరాబాద్ కు వచ్చిన 259 మందిని కోవిడ్ ఆర్టీపీసీఆర్ టెస్టులు చేశారు. వీరిలో నలుగురికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఈ నలుగురి నమూనాలను అధికారులు జీనోమ్ సీక్వెన్సింగ్కి పంపించారు. ఇప్పటి వరకు ఎట్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన 9,381 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 63 మందికి కరోనా నిర్థారణ అయ్యింది. వీరి నమూనాలను అధికారులు జీనోమ్ సీక్వెన్సింగ్కి పంపించారు. వారిలో 22 మందికి ఒమిక్రాన్ నెగెటివ్ వచ్చిందని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. మిగిలిన వారిలో 38 మందికి ఒమిక్రాన్ పాజిటివ్ అని తేలింది. మరో నలుగురి ఫలితాలు ఇంకా రావాల్సిఉంది.