Breaking News Live: తెలంగాణలో కొత్తగా 14 ఒమిక్రాన్ కేసులు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 22 Dec 2021 09:38 PM

Background

శీతకాల విడిది కోసం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ నెల 29న బొలారంలోని రాష్ట్రపతి నిలయానికి రానున్నారు. జనవరి 3 వరకు ఆయన ఇక్కడ బస చేసే అవకాశం ఉంది. ఇందుకోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కంటోన్మెంట్‌ బోర్డు అధికారులు...More

తెలంగాణలో కొత్తగా 14 ఒమిక్రాన్ కేసులు

తెలంగాణలో కొత్తగా 14 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. రిస్క్ దేశాల నుంచి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ సోకింది. విదేశాల నుంచి వచ్చిన 12 మందికి ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చిందని తెలిపారు. దీంతో తెలంగాణ మొత్తం ఒమిక్రాన్ కేసులు 38కు చేరాయి.