Breaking News Live: తెలంగాణలో ఒమిక్రాన్ మరో కేసు.. హన్మకొండలో గుర్తింపు: డీహెచ్
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
ABP Desam Last Updated: 17 Dec 2021 12:15 PM
Background
నల్గొండ జిల్లాలోని కనగల్ మండలం ఎడవెల్లిలో దారుణం జరిగింది. భూ వివాదాల నెపంతో ఓ మహిళపై ప్రత్యర్థులు దాడికి తెగబడ్డారు. దెబ్బలకు తాళలేక బాధితురాలు తిరుపతమ్మ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆస్పత్రికి...More
నల్గొండ జిల్లాలోని కనగల్ మండలం ఎడవెల్లిలో దారుణం జరిగింది. భూ వివాదాల నెపంతో ఓ మహిళపై ప్రత్యర్థులు దాడికి తెగబడ్డారు. దెబ్బలకు తాళలేక బాధితురాలు తిరుపతమ్మ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యనల్గొండలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. రైలు కింద పడి గాంధీనగర్కు చెందిన జాహ్నవి(16) ప్రాణాలు తీసుకుంది. తక్కువ మార్కులు వచ్చాయని తల్లిదండ్రులు తిట్టారని మనస్తాపం చెందిన బాలిక ఈ అఘాయిత్యానికి పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా కలకం రేపింది.పడిపోయిన ఉష్ణోగ్రతలుతెలుగు రాష్ట్రాలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తక్కువ స్థాయిలో నమోదు అవుతున్నాయి. కొమురంభీం జిల్లా గిన్నెదరిలో 8.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. సంగారెడ్డి జిల్లా కోహిర్లో 8.9, విశాఖపట్నం జిల్లా మినుములూరులో 8 డిగ్రీలు, పాడేరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యింది.బంగారం ధరలుతెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో గ్రాముకు రూ.30 చొప్పున పెరిగింది. పది గ్రాములకు రూ.300 పెరిగింది. వెండి ధర రూ.0.50 పైసలు పెరిగింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో రూ.45,300 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.49,420 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో కిలో రూ.65,100గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి. ఇక విశాఖపట్నం మార్కెట్లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,300 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,420గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.65,100 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.45,300 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.49,420గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.65,100గా ఉంది.పెట్రోల్, డీజిల్ ధరలుహైదరాబాద్లో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా స్థిరంగానే ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే ఉంది. గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్లో ధరలు స్థిరంగానే ఉంటున్నాయి. ఇక వరంగల్లో నేడు (డిసెంబరు 17) పెట్రోల్ ధర రూ.107.69 గా స్థిరంగానే కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.94.14 గానే కొనసాగుతోంది. నిజామాబాద్లో ఇంధన ధరలు నేడు తగ్గాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.0.18 పైసలు తగ్గి రూ.110.09 గా ఉంది. డీజిల్ ధర రూ.0.16 పైసలు తగ్గి రూ.96.38 గా ఉంది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.ఆంధ్రప్రదేశ్లో ఇంధన ధరలు ఇలా..విశాఖపట్నం మార్కెట్లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.109.05గా ఉంది. పాత ధరతో పోలిస్తే ఏకంగా రూ.0.25 పైసలు తగ్గింది. డీజిల్ ధర విశాఖపట్నంలో రూ.95.18గా ఉంది. ఇది రూ.0.23 పైసలు తగ్గింది. ఇక విజయవాడ మార్కెట్లో పెట్రోల్ ధర నేడు పెరిగింది. లీటరు ధర ప్రస్తుతం రూ.0.31 పైసలు పెరిగి రూ.110.51 గా ఉంది. డీజిల్ ధర రూ.0.31 పైసలు పెరిగి రూ.96.59గా ఉంది. అయితే, అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉన్నాయి.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
హన్మకొండలోనూ ఒమిక్రాన్ గుర్తింపు
తెలంగాణలో మరో ఒమిక్రాన్ కేసును గుర్తించారు. కొత్తగా హన్మకొండలో ఓ కొత్త ఒమిక్రాన్ కేసును గుర్తించారు. ఈ 8 మందిలో ఎలాంటి లక్షణాలు లేవని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వెల్లడించారు. గతంలో కొవిడ్ బారిన పడ్డ వారికి కూడా ఈ ఒమిక్రాన్ సోకుతోందని డీహెచ్ చెప్పారు.