Breaking News Live: శిల్పా చౌదరికి బెయిల్ మంజూరు.. షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన కోర్టు
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
ABP Desam Last Updated: 16 Dec 2021 04:30 PM
Background
ప్రకాశం జిల్లాలో ఓ ప్రైవేటు బస్సు అగ్ని కీలల్లో చిక్కుకుంది. ప్రకాశం జిల్లాలోని పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం వద్ద ఓ ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో మంటల ధాటికి బస్సు పూర్తిగా కాలిపోయింది. అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే బస్సు...More
ప్రకాశం జిల్లాలో ఓ ప్రైవేటు బస్సు అగ్ని కీలల్లో చిక్కుకుంది. ప్రకాశం జిల్లాలోని పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం వద్ద ఓ ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో మంటల ధాటికి బస్సు పూర్తిగా కాలిపోయింది. అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే బస్సు నుంచి బయటకి వచ్చేసి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి అపాయం జరగలేదు. కాకపోతే, బస్సులోనే ఉన్న ప్రయాణికుల సామాన్లు అన్ని అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రైవేటు బస్సు హైదరాబాద్ నుంచి చీరాల వస్తుండగా ఇలా కాలిపోయింది.పెట్రోల్, డీజిల్ ధరలుహైదరాబాద్లో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా స్థిరంగానే ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే ఉంది. గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్లో ధరలు స్థిరంగానే ఉంటున్నాయి. ఇక వరంగల్లో నేడు (డిసెంబరు 16) పెట్రోల్ ధర రూ.107.69 గా స్థిరంగానే కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.95.68 గానే కొనసాగుతోంది. రెండు రోజులుగా వరంగల్లో ఈ ధరలే ఉంటున్నాయి. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి. విశాఖపట్నం మార్కెట్లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.109.05గా ఉంది. పాత ధరతో పోలిస్తే ఏకంగా రూ.0.25 పైసలు తగ్గింది. డీజిల్ ధర విశాఖపట్నంలో రూ.95.18గా ఉంది. ఇది రూ.0.23 పైసలు తగ్గింది. విజయవాడ మార్కెట్లో పెట్రోల్ ధర నేడు కాస్త తగ్గింది. లీటరు ధర ప్రస్తుతం రూ.0.09 పైసలు తగ్గి రూ.110.20 గా ఉంది. డీజిల్ ధర రూ.0.08 పైసలు తగ్గి రూ.96.28గా ఉంది. అయితే, అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉన్నాయి.బంగారం ధరలుతెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర బాగా తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో గ్రాముకు రూ.25 చొప్పున తగ్గింది. పది గ్రాములకు రూ.250 తగ్గింది. వెండి ధర రూ.0.70 పైసలు తగ్గింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో రూ.45,000 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.49,100 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో కిలో రూ.64,600గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.ఇక విశాఖపట్నం మార్కెట్లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,000 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,100గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.64,600 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.45,000 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.49,100గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.64,600గా ఉంది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
శిల్పా చౌదరికి బెయిల్ మంజూరు.. షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన కోర్టు
శిల్పా చౌదరికి బెయిల్ మంజూరైంది. ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ఉప్పర్ పల్లి కోర్టు. పలువురిని మోసం చేసిన కేసులో శిల్పా చౌదరి అరెస్టు అయిన విషయం తెలిసిందే. పెట్టుబడుల పేరుతో పలువురి నుంచి డబ్బులు తీసుకున్నారు శిల్ప చౌదరి.