ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కుమార్ జనతా గణేష్ మండల్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన 48 అడుగుల భారీ గణపతి మండపం వద్ద 21 కేజీల లడ్డుని గురువారం (సెప్టెంబరు 28) వేలం వేశారు. ఈ 21 కేజీల లడ్డూని దక్కించుకునేందుకు ఔత్సాహికులు పాల్గొన్నారు. ఈ వేలంపాట హోరాహోరీగా సాగింది. రూ.5 వేల నుంచి ఈ వేలం ప్రారంభం అయింది. చివరకు ఆదిలాబాద్ పట్టణంలోని మహాలక్ష్మీవాడకు చెందిన ముస్లిం యువకుడు షేక్ ఆసిఫ్ రూ.1.2 లక్షలకు దక్కించుకున్నాడు. అనంతరం యువకుడిని మండప సభ్యులు శాలువతో సన్మానించారు.