IPS Transfer in Telangana: హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. రాష్ట్ర పోలీస్ శాఖలో ఉన్నత స్థానాల్లో ఉన్న 12 మంది ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. మల్టీజోన్‌-2 ఐజీగా సుధీర్‌బాబు బదిలీ అయ్యారు. రాచకొండ సీపీ సుధీర్‌బాబు స్థానంలో తరుణ్‌ జోషిని నియమితులయ్యారు. డిప్యూజీ ఐజీ శ్రీనివాసులను రామగుండం కమిషనర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. ఎల్ఎస్ చౌహాన్ ను జోగులాంబ జోన్ 7 డీఐజీగా నియమించింది. సైబరాబాద్‌ ట్రాఫిక్‌ జాయింట్ సీపీగా జోయల్‌ డేవిస్‌కు పోస్టింగ్ ఇవ్వగా.. కే నారాయణ్ నాయక్ కు సీఐడీ డీఐజీగా బాధ్యతలు అప్పగించారు. 

12 మంది ఐపీఎస్‌ల బదిలీ- రాచకొండ సీపీగా తరుణ్‌ జోషి- మల్టీజోన్‌-2 ఐజీగా రాచకొండ సీపీగా ఉన్న సుధీర్‌బాబు బదిలీ- రామగుండం కమిషనర్‌గా శ్రీనివాసులు- సైబరాబాద్‌ ట్రాఫిక్‌ జాయింట్ సీపీగా జోయల్‌ డేవిస్‌- సీఐడీ డీఐజీగా నారాయణ నాయక్‌- హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీగా సాధన రష్మి పెరుమాళ- సౌత్‌ వెస్ట్‌ జోన్‌ డీసీపీగా ఉదయ్‌ కుమార్‌- ఈస్ట్‌ జోన్‌ డీసీపీగా గిరిధర్‌- ఆర్టీసీ విజిలెన్స్‌ ఎస్పీగా అపూర్వరావు- తెలంగాణ పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా డి. మురళీధర్