వన్‌ప్లస్ తన కొత్త స్మార్ట్ టీవీలు మనదేశంలో లాంచ్ చేయనుంది. అవే వన్‌ప్లస్ టీవీ వై1ఎస్, వన్‌ప్లస్ టీవీ వై1ఎస్ ఎడ్జ్. త్వరలో రానున్న స్మార్ట్ టీవీ మోడల్స్‌లో అంచులు లేని డిజైన్ అందించనుందని కంపెనీ తెలిపింది. వన్‌ప్లస్ టీవీ వై1ఎస్ స్మార్ట్ ఫోన్‌లో 20W స్పీకర్లు ఉండనున్నాయని తెలుస్తోంది. అయితే ఈ టీవీలు ఎప్పుడు లాంచ్ కానున్నాయి, వీటి ధర ఎంత అనేది తెలియరాలేదు.


ఈ స్మార్ట్ టీవీల ధరను కంపెనీ ఇంకా తెలపలేదు. ఈ స్మార్ట్ టీవీలు లాంచ్ అయ్యే సమయంలో వీటి ధరను ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం మనదేశంలో అందుబాటులో ఉన్న వన్‌ప్లస్ టీవీల్లో అత్యంత చవకైనది వన్‌ప్లస్ టీవీ 32వై1నే. ఈ టీవీ ధరను రూ.16,499గా నిర్ణయించారు. వన్‌ప్లస్ టీవీ వై1ఎస్‌ కంపెనీ అధికారిక వెబ్ సైట్‌లో అందుబాటులో ఉండనుంది. వన్‌ప్లస్ టీవీ వై1ఎస్ ఎడ్జ్ స్మార్ట్ టీవీని కేవలం ఆఫ్‌లైన్ స్టోర్లలో మాత్రమే విక్రయించనున్నారు.


వన్‌ప్లస్ టీవీ వై1ఎస్, వన్‌ప్లస్ టీవీ వై1ఎస్ ఎడ్జ్ స్మార్ట్ టీవీలు కంపెనీ బడ్జెట్ వై-సిరీస్ టీవీల్లో లేటెస్ట్‌గా లాంచ్ కానున్నాయి. ప్రస్తుతం వన్‌ప్లస్ వేర్వేరు కేటగిరీల్లో టీవీలను అందిస్తుంది. వన్‌ప్లస్ క్యూ-సిరీస్ టీవీలు పూర్తిగా ప్రీమియం స్మార్ట్ టీవీలు కాగా.. యూ-సిరీస్ టీవీల ద్వారా తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లు అందిస్తున్నారు. వన్‌ప్లస్ వై-సిరీస్ టీవీలు పూర్తిగా బడ్జెట్ ధరలో అందుబాటులో ఉన్నాయి.


వన్‌ప్లస్ టీవీ వై1ఎస్ సిరీస్ ఫోన్లు ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో 32 అంగుళాలు, 43 అంగుళాల వేరియంట్లు ఉండనున్నాయి. వీటిలో 20W స్పీకర్లు ఉండనున్నాయి. డాల్బీ ఆడియో, అట్మాస్ డీకోడింగ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇందులో డ్యూయల్ బ్యాండ్ వైఫై కనెక్టివిటీ ఫీచర్ కూడా ఉండనుంది.