ఒప్పో ఏ57 (2022) స్మార్ట్ ఫోన్ థాయ్‌ల్యాండ్‌లో లాంచ్ అయింది. మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌తో ఈ ఫోన్ ఎంట్రీ ఇచ్చింది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.


ఒప్పో ఏ57 (2022) ధర
దీని ధరను 5,499 థాయ్ బాత్‌లుగా (సుమారు రూ.12,500) నిర్ణయించారు. గ్లోయింగ్ బ్లాక్, గ్లోయింగ్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఒప్పో ఏ57 (2022) మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.


ఒప్పో ఏ57 (2022) స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత కలర్ఓఎస్ 12.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 6.56 అంగుళాల హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లేను ఇందులో అందించారు. ఫోన్ వెనకవైపు 13 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌లను అందించారు. ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.


3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకునే అవకాశం ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.


4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టులు కూడా ఈ ఫోన్‌లో ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఒప్పో ఏ57 (2022) సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.79 సెంటీమీటర్లు కాగా... బరువు 187 గ్రాములుగా ఉంది.


Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?


Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!