ఒప్పో తన కొత్త ట్యాబ్లెట్‌ను చైనాలో లాంచ్ చేసింది. అదే ఒప్పో ప్యాడ్ ఎయిర్. కంపెనీ లాంచ్ చేసిన రెండో ట్యాబ్లెట్ ఇదే. ఇందులో 10.36 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. దీని మందం కేవలం 0.69 సెంటీమీటర్లు మాత్రమే కావడం విశేషం.


ఒప్పో ప్యాడ్ ఎయిర్ ధర
ఈ ట్యాబ్లెట్ మూడు వేరియంట్లలో లాంచ్ అయింది. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ మోడల్ ధర 1,299 యువాన్లుగా (సుమారు రూ.15,100) నిర్ణయించారు. ఇక 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,899 యువాన్లుగా (సుమారు రూ.22,070) ఉంది. మిర్రర్ బ్లాక్, ఫాగ్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. మనదేశంలో ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.


ఒప్పో ప్యాడ్ ఎయిర్ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 10.36 అంగుళాల 2కే డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గా ఉంది. ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌పై ఈ ట్యాబ్లెట్ పనిచేయనుంది. 6 జీబీ వరకు ర్యామ్‌ను ఇందులో అందించారు.


ట్యాబ్లెట్ వెనకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను, ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. 128 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ కూడా ఇందులో ఉంది. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు. యూఎస్‌బీ ఓటీజీని కూడా ఇది సపోర్ట్ చేయనుంది.


డాల్బీ అట్మాస్‌ను ఈ ట్యాబ్ సపోర్ట్ చేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 7100 ఎంఏహెచ్‌గా ఉంది. 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. వైఫై 5, బ్లూటూత్ వీ5.1, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. దీని మందం 0.69 సెంటీమీటర్లు కాగా... బరువు 440 గ్రాములుగా ఉంది.


Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?


Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!