Sanju Samson Breaks MS Dhoni Record for Most Runs: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో మహేంద్ర సింగ్ ధోని సుదీర్ఘకాలంగా ఏలుతున్న ఒక అరుదైన రికార్డుల లిస్టులో సంజు శాంసన్ తన పేరును లిఖించుకున్నాడు. సోమవారం చెపాక్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ ఈ అద్భుతమైన ఘనత సాధించాడు. ఒకే ఐపీఎల్ సీజన్ లో సీఎస్‌కే తరపున ఒక వికెట్ కీపర్ గా అత్యధిక పరుగులు చేసిన ఎంఎస్ ధోని రికార్డును ఆయన బద్దలు కొట్టాడు. ఇంతకుముందు ధోని 2013 ఐపీఎల్ సీజన్ లో 16 ఇన్నింగ్స్ ఆడి 461 పరుగులు సాధించాడు. ఈ మార్కును దాటడానికి శాంసన్‌కు మ్యాచ్ ప్రారంభంలో కేవలం 12 పరుగులు మాత్రమే అవసరం అవ్వగా, ఆయన కేవలం ఆరు బంతుల్లోనే 15 పరుగులు చేసి ఆ మైలురాయిని దాటేశాడు. హైదరాబాద్ బౌలర్ నితీష్ కుమార్ రెడ్డి వేసిన మొదటి ఓవర్ లోనే శాంసన్ ఈ స్కోరు అందుకోవడం విశేషం.

Continues below advertisement

Read Also: Vaibhav Sooryavanshi Breaks Abhishek Sharma's Record: వైభవ్ సూర్యవంశీ సరికొత్త రికార్డు - అభిషేక్ శ‌ర్మ రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన టీనేజ‌ర్

టాప్ ఆర్డర్ లో శాంసన్ అటాకింగ్..

Continues below advertisement

రికార్డు దాటిన తర్వాత కూడా సంజు శాంసన్ తన అగ్రెసివ్ బ్యాటింగ్ శైలిని అస్సలు ఆపలేదు. రెండో ఓవర్ లో బౌలింగ్‌కు వచ్చిన ప్రఫుల్ హింగే ఓవర్ లో వరుసగా మూడు బౌండరీలు బాది స్టేడియాన్ని హోరెత్తించాడు. కేవలం 11 బంతుల్లోనే 27 పరుగులు చేసి మంచి టచ్ లో కనిపించిన శాంసన్‌ను అడ్డుకోవడానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ స్వయంగా బౌలింగ్ రంగానికి వచ్చాడు. కమిన్స్ వేసిన ఒక పవర్‌ఫుల్ యార్కర్‌ను శాంసన్ సమర్థవంతంగా డిఫెండ్ చేశాడు. ఆ తర్వాతి బంతిని కమిన్స్ ఆఫ్ స్టంప్‌కు వెలుపల వేయగా, శాంసన్ డ్రైవ్ చేయడానికి ప్రయత్నించాడు. ఆ షాట్ మిస్ అవ్వడంతో బంతి బ్యాట్ ఎడ్జ్ కు తగిలి వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్ళింది. దాంతో శాంసన్ ఇన్నింగ్స్ ముగిసింది.

Read Also: నేడు MS Dhoni ఐపీఎల్‌కి వీడ్కోలు పలుకుతాడా ? చెన్నైలోCSK తరఫున చివరి మ్యాచ్ ఆడుతున్నాడా!

సీఎస్‌కే చరిత్రలో నిలిచిన ముగ్గురు వికెట్ కీపర్లు

ఓవరాల్ గా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్ గా ధోని రికార్డులు అన్-మ్యాచ్‌డ్ గా ఉన్నప్పటికీ, ఈ లిస్టులో ప్రముఖంగా నిలిచిన రెండో ప్లేయర్ గా సంజు శాంసన్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఐపీఎల్ లో ఒకే సీజన్ లో సీఎస్‌కే తరపున 100 కంటే ఎక్కువ పరుగులు చేసిన వికెట్ కీపర్లు కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు. వారిలో మొదటి వ్యక్తి ఎంఎస్ ధోని కాగా, రెండో ఆటగాడు 2008 సీజన్ లో రాణించిన పార్థివ్ పటేల్. ఇప్పుడు ఈ 2026 సీజన్ లో సంజు శాంసన్ ఆ లిస్టులోకి చేరాడు. ప్రస్తుత ఐపీఎల్ 2026 టోర్నమెంట్ లో శాంసన్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఆయన ఇప్పటివరకు 13 ఇన్నింగ్స్ ఆడి 47.7 సగటుతో మొత్తంగా 477 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ రేసులో దూసుకుపోతున్నాడు.

ధోనికి ఫిట్‌నెస్ సమస్యలు..

అంతకుముందు ఎమ్ ఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్ లో అంతకుముందు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు చెన్నైని 10 పరుగుల తేడాతో ఓడించింది. టాస్ సమయంలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఒక ముఖ్యమైన విషయాన్ని షేర్ చేశాడు. ఫిట్‌నెస్ సమస్యల కారణంగా లెజెండరీ ప్లేయర్ ఎంఎస్ ధోని ఈ మ్యాచ్ ఆడటం లేదని స్పష్టం చేశాడు.  ధోని జట్టుతోనే ఉన్నప్పటికీ ఆడే పరిస్థితిలో లేకపోవడం వల్ల జట్టులో ఒక మార్పు చేసినట్లు రుతురాజ్ పేర్కొన్నాడు.