MS Dhoni IPL 2025: ధోని అవుట్ అయ్యాడా? లేదా? అంపైర్ నిర్ణయంపై తీవ్ర దుమారం!

MS Dhoni IPL 2025: ఐపీఎల్ 2025లో ధోని రాణించలేకపోతున్నాడు కేకేఆర్ తో మ్యాచ్ లో చాలా ఏళ్ల తర్వాత కెప్టెన్‌గా ఆడాడు. ఒక పరుగు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు.

Continues below advertisement

MS Dhoni CSK vs KKR IPL 2025: చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2025లో 25వ మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలైంది. కోల్‌కతా నైట్ రైడర్స్ చెన్నైని కేవలం 103 పరుగులకే పరిమితం చేసింది. ఈ క్రమంలో మహేంద్ర సింగ్ ధోని 1 పరుగు చేసి అవుట్ అయ్యాడు. ధోని అవుట్ అవ్వడంపై వివాదం చెలరేగింది. ధోని అవుట్‌పై సోషల్ మీడియాలో అనేక పోస్టులు షేర్ పెట్టారు. అనేక మాజీ క్రికెటర్లు కూడా ధోని అవుట్‌పై ప్రశ్నలు లేవనెత్తారు.

Continues below advertisement

కేకేఆర్‌తో మ్యాచ్‌లో ధోని 9వ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. అతను కేవలం 1 పరుగు చేసి అవుట్ అయ్యాడు. గ్రౌండ్ అంపైర్ ధోనిని అవుట్‌గా ప్రకటించాడు. కానీ ధోని డీఆర్‌ఎస్ తీసుకున్నాడు. థర్డ్ అంపైర్ కూడా ధోనిని అవుట్‌గా ప్రకటించాడు. రివ్యూ సమయంలో బంతి బ్యాట్ దగ్గర నుంచి వెళ్ళినట్టు స్క్రీన్‌పై స్పైక్స్ కనిపించాయి. అయినప్పటికీ అంపైర్ అవుట్ ఇచ్చాడు. 

ధోని అవుట్‌పై అనేక ప్రశ్నలు
ధోని అవుట్ గురించి కమెంటేటర్లు చర్చించుకున్నారు. నవజోత్ సింగ్ సిద్ధు కూడా అనుమానం వ్యక్తం చేశాడు. ''బంతి బ్యాట్ దగ్గర నుంచి వెళ్ళినప్పుడు స్పైక్స్ కనిపించాయి'' అని అన్నారు. దీనికి సమాధానంగా అంబటి రాయుడు మాట్లాడుతూ''అంపైర్ల నిర్ణయం గురించి తర్వాత తెలుసుకుంటారని'' అని అన్నారు. 

ధోని అవుట్ అయ్యాడా? లేదా?
క్రికెట్ గ్రౌండ్‌లో అంపైర్ నిర్ణయమే ఫైనల్‌. నియమాల ప్రకారం అంపైర్ ధోనిని అవుట్‌గా ప్రకటించాడు. కాబట్టి అతను అవుట్ అయ్యాడు. గ్రౌండ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించినప్పుడు, రివ్యూ తీసుకోవచ్చు. క్రీడాకారుడు రివ్యూ తీసుకున్నప్పుడు, నిర్ణయం థర్డ్ అంపైర్ దగ్గరకు వెళ్తుంది. థర్డ్ అంపైర్ ఇచ్చే నిర్ణయం ఫైనల్. కాబట్టి ధోని అవుట్ అయినట్లే పరిగణించారు.  

 

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే కేవలం 109 పరుగులు మాత్రమే చేయగలిగింది. సునీల్ నరైన్ 3 వికెట్లు పడగొట్టాడు. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నరైన్ 18 బంతుల్లో 44 పరుగులతో విధ్వంసమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సీజన్‌లో చెన్నైకి ఇది వరుసగా ఐదో ఓటమి. ఐపీఎల్ చరిత్రలో చెపాక్‌లో సీఎస్‌కే వరుసగా 3 మ్యాచ్‌ల్లో ఓడిపోవడం ఇదే తొలిసారి. డిఫెండింగ్‌లో సీఎస్‌కేకి ఇది అతిపెద్ద ఓటమి (మిగిలిన అత్యధిక బంతుల ఆధారంగా).

104 పరుగుల చిన్న లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో క్వింటన్ డి కాక్, సునీల్ నరైన్ తొలి వికెట్‌కు 4 ఓవర్లలో 46 పరుగులు చేశారు. 16 బంతుల్లో 23 పరుగులు చేసిన తర్వాత డి కాక్ ఔటయ్యాడు. అతను 3 సిక్సర్లు బాదాడు. 8వ ఓవర్‌లో సునీల్ నరైన్ రూపంలో రెండో వికెట్ పడిపోయింది. అప్పటికే 90 శాతం పని పూర్తి చేశాడు.  అతను 18 బంతుల్లో 44 పరుగులతో భీకరమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లో నరైన్ 5 సిక్సర్లు, 2 ఫోర్లు కొట్టాడు.

కెకెఆర్ ఇన్నింగ్స్‌లో మొత్తం 10 సిక్సర్లు బాదారు. సిఎస్‌కె ఇన్నింగ్స్‌లో అన్ని ఫోర్లు కూడా కొట్టలేకపోయారు. చెన్నై సూపర్ కింగ్స్ మొత్తం ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు మాత్రమే బాదారు. కెకెఆర్ ఇంకా 59 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఈ విజయంతో, కెకెఆర్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానం నుంచి మూడో స్థానానికి చేరుకుంది.

Continues below advertisement