IPL 2026 Opening Ceremony: ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్ మార్చి 28న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు , సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభోత్సవం జరగదని బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా ధృవీకరించారు.
గత సంవత్సరం జూన్ 4న, ఆర్సిబి విజయ పరేడ్ సందర్భంగా ఎం. చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించారు. వారి కుటుంబాల పట్ల సానుభూతి, స్మరణ, గౌరవంతో, ప్రారంభోత్సవాన్ని నిర్వహించకూడదని బిసిసిఐ నిర్ణయించింది. గత సంవత్సరం, పంజాబ్ కింగ్స్ను ఓడించి ఆర్సిబి తన మొదటి ఐపిఎల్ టైటిల్ను గెలుచుకుంది.
BCCI ధృవీకరించింది
శనివారం జరిగే ఐపీఎల్ తొలి మ్యాచ్కు ముందు ఎలాంటి వేడుకలు నిర్వహించకూడదని బీసీసీఐ నిర్ణయించింది. అయితే, ఐపీఎల్ 2026 కోసం బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కలిసి ఒక ఘనమైన ముగింపు వేడుకను నిర్వహించడానికి ప్రణాళికలు రచిస్తున్నాయని బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా తెలిపారు.
టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ, దేవ్జిత్ సైకియా ఇలా అన్నారు, "గత సంవత్సరం జూన్ 4న జరిగిన విషాద ఘటన కారణంగా, ఐపీఎల్ 2026 ప్రారంభ రోజున ఎలాంటి అధికారిక కార్యక్రమం ఉండదు. బీసీసీఐ ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించడం లేదు."
ఐపీఎల్ ఫైనల్ జరిగే రోజున ఘనంగా ముగింపు వేడుకను నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోంది. ఐపీఎల్ 2026 ఫైనల్ మే 31న జరగనుంది. 10 జట్లు పాల్గొంటున్న ఈ లీగ్ కోసం బీసీసీఐ కేవలం 20 మ్యాచ్ల షెడ్యూల్ను మాత్రమే ప్రకటించింది.
గత ఎడిషన్లో జరిగిన అంగరంగ వైభవమైన ప్రారంభోత్సవంలో షారుఖ్ ఖాన్, శ్రేయా ఘోషల్, కరణ్ ఔజ్లా, దిశా పటాని ప్రదర్శనలు ఇచ్చారు.
ఆర్సిబి వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో వర్షం పడే అవకాశాలు
మార్చి 28, శనివారం నాడు బెంగళూరులో వర్షం కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ ప్రకారం, శనివారం నాటి మ్యాచ్ సమయంలో 10 నుంచి 15 శాతం వర్షం పడే అవకాశం ఉంది. గత సీజన్లో తమ మొదటి టైటిల్ను గెలుచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, డిఫెండింగ్ ఛాంపియన్లుగా ఈ లీగ్లో పాల్గొంటోంది.
