Hardik Pandya on Rohit Sharma : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ipl) ప్రారంభానికి మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉంది. ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలని అన్ని జట్లు వ్యూహ ప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌ (MI) కొత్త కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా(Hardic Pandya) జట్టుతో కలిశాడు. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఎవరూ మరచిపోలేని ప్రదర్శన ఇస్తామని పాండ్యా ధీమా వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను ముంబై సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. ముంబై జెర్సీ ధరించడం ఎప్పుడూ ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుందని అన్నాడు. సొంత గూటికి తిరిగి రావడం ఎప్పుడూ ప్రత్యేకమే అని పాండ్యా అన్నాడు. మలింగ సోదరుడిలా ఉన్నాడని... మార్క్‌ బౌచర్‌ ఓ అద్భుతమని కొనియాడాడు. అయితే కెప్టెన్సీ మార్పుపై తొలిసారి పాండ్యా స్పందించాడు. 


ఇంతకీ పాండ్యా ఏమన్నాడంటే..?
ముంబై కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ  లేనంత మాత్రాన ఏమీ మారదని.. తన భుజాలపై చేతులేసి అతనే నడిపిస్తాడని ముంబై కొత్త కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య అన్నాడు. కెప్టెన్‌గా తాను ఉన్నప్పటికీ ఏం తేడా ఉండదని.... రోహిత్ తనకు సాయం చేసేందుకు సిద్దంగా ఉంటాడని పాండ్యా తెలిపాడు. ముంబై సాధించిన ఘనతలన్నీ రోహిత్‌ సారధ్యంలో సాధ్యమయ్యాయని... తాను దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సి ఉందని పాండ్యా వెల్లడించాడు. తన భుజాలపై చేతులేసి రోహిత్‌ నడిపిస్తాడని... తాము అభిమానులను గౌరవిస్తామని... కానీ జట్టుకు ఏది అవసరమనేదానిపై దృష్టి పెడతామని కూడా పాండ్యా తెలిపాడు. 



ఓ ప్రత్యేక అనుభూతి
ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఎవరూ మరచిపోలేని ప్రదర్శన ఇస్తామని పాండ్యా ధీమా వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను ముంబై సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. ముంబై జెర్సీ ధరించడం ఎప్పుడూ ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుందని అన్నాడు. సొంత గూటికి తిరిగి రావడం ఎప్పుడూ ప్రత్యేకమే అని పాండ్యా అన్నాడు. మలింగ సోదరుడిలా ఉన్నాడని... మార్క్‌ బౌచర్‌ ఓ అద్భుతమని కొనియాడాడు. ఎవరూ మరచిపోలేని ఆటతీరు ప్రదర్శిమన్న పాండ్యా... ముంబై ప్రధాన కోచ్ మార్క్ బౌచర్ ప్రశంసలు కురిపించాడు. బౌచర్‌ సారథ్యంలో విజయాలకు ఎదురుచూస్తున్నాం. టీమ్‌లో కొంతమంది కొత్తవాళ్లు ఉన్నారు.


వెనక ఇంత జరిగిందా..?
ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మ (Rohit Sharma)ను తప్పించిన తరువాత తెరవెనుక పెద్ద వివాదమే జరిగింది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను నియమించిన తరువాత జట్టులో అంతర్గతంగా సైతం ఈ నిర్ణయం ఎవరికీ రుచించలేదు. పైగా ఫ్యాన్స్ అయితే భారీ స్థాయిలో సోషల్ మీడియా ఖాతాల్లో ముంబై ఇండియన్స్ ను అన్ ఫాలో చేశారు. రోహిత్‌ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగిస్తూ ముంబై మేనేజ్‌మెంట్‌ తీసుకున్న నిర్ణయంతో అభిమానుల హృదయం ముక్కలైంది. ముంబై టీమ్‌కు ఎన్నో టైటిళ్లు అందించిన రోహిత్‌ను పక్కన పెట్టిన ముంబై టీమ్ హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా చేసింది. దీంతో వివాదం చెలరేగింది.