భారత్‌తో జరుగుతోన్న మూడో టెస్టు రెండో రోజు ఆటలో ఆతిథ్య ఇంగ్లాండ్‌దే పూర్తి హవా నడిచింది. ఓవర్ నైట్ స్కోరు 120/0 తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ ఆచి తూచి ఆడి భారీ ఆధిక్యాన్ని సాధించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 8 వికెట్ల నష్టానికి 423 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 345 పరుగుల ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది. 








జో రూట్ జోరు 



భారత్‌తో ఈ టెస్టు సిరీస్‌లో ఆది నుంచి ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ అదరగొడుతున్నాడు. మొదటి రెండు టెస్టుల్లో సెంచరీలు చేసిన రూట్ మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ శతకంతో చెలరేగాడు. మ్యాచ్‌లో రెండో రోజైన గురువారం 124 బంతుల్లోనే జో రూట్ 12 ఫోర్ల సాయంతో 100 పరుగులు పూర్తి చేశాడు. ఈ సిరీస్‌లో రూట్ కిది మూడో శతకం కావడం గమనార్హం.