Sushil Kumar Bail Petition Rejected: మాజీ జూనియర్ నేషనల్ రెజ్లింగ్ ఛాంపియన్ సాగర్ ధన్కర్ మర్డర్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఒలింపియన్ సుశీల్ కుమార్కు ఢిల్లీ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. అతడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను ఆగస్టు 6న జస్టిస్ పురుషైంద్ర కుమార్ కౌరవ్ డిస్మిస్ చేశారు. సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని, కేసు తీవ్రత, అతడి ముందస్తు ప్రవర్తనను పరిగణనలోకి తీసుకుని బెయిల్ నిరాకరించినట్లు కోర్టు తెలిపింది. సాధారణంగా బెయిల్ అనేది ఒక నియమమే అయినప్పటికీ, ఈ కేసులో పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన దాడి వల్ల మరణం సంభవించిందని, దీనికి సంబంధించి ఆయుధాల రికవరీ, వీడియో సాక్ష్యాలు ఉన్నాయని కోర్టు పేర్కొంది.
మార్పుల ఆధారంగా బెయిల్ కోరిన లాయర్.. ఢిల్లీ పోలీస్ తీవ్ర అభ్యంతరంసుశీల్ కుమార్ తరఫు లాయర్ కోర్టులో వాదనలు వినిపిస్తూ, ఫిర్యాదుదారుడైన మృతుడి తండ్రి విచారణలో ప్రాసిక్యూషన్కు సపోర్ట్ చేయలేదని తెలిపాడు. సుశీల్ కుమార్ గత ఐదేళ్లుగా కస్టడీలోనే ఉన్నాడని, కేసులో కేవలం అఫీషియల్ సాక్షులు మాత్రమే మిగిలి ఉన్నందున బెయిల్ మంజూరు చేయాలని కోరాడు. కానీ ఢిల్లీ పోలీస్, ధన్కర్ తండ్రి ఈ బెయిల్ అప్లికేషన్ను తీవ్రంగా వ్యతిరేకించారు. సుశీల్ కుమార్కు ఉన్న సొసైటీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల బెయిల్ ఇస్తే సాక్షులు హోస్టైల్ అవుతారని అంతకుముందు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయాన్ని బెంచ్ గుర్తుచేసింది.
సీన్ లో సుప్రీంకోర్టు ఆర్డర్స్.. పిటిషన్ డిస్మిస్ చేసిన హైకోర్టుమృతుడి తండ్రి డిపోజిషన్ ప్రాసిక్యూషన్కు సపోర్ట్ చేస్తుందా లేదా అనేది విచారణ కోర్టు ముగించాల్సిన అంశమని హైకోర్టు తెలిపింది. సుప్రీంకోర్టు గతంలో క్లోజ్ చేసిన డోర్స్ను రీఓపెన్ చేయడానికి ఇది సరైన కారణం కాదని బెంచ్ స్పష్టం చేసింది. ఈ క్రమంలో బెయిల్ ఇవ్వడానికి ఎలాంటి ప్రత్యేక పరిస్థితులు లేవని తేల్చిచెప్పింది. 2021 మే నెలలో అరెస్ట్ అయిన సుశీల్ కుమార్, 2023 జూలైలో మోకాలి సర్జరీ కోసం వారం రోజులు తాత్కాలిక బెయిల్ పొందాడు.
స్టేడియంలో దాడి.. ఐపీసీ, ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు2025 మార్చిలో హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా, 2025 ఆగస్టు 13న సుప్రీంకోర్టు ఆ ఆర్డర్ను రద్దు చేసింది. 2022 అక్టోబర్లో ట్రయల్ కోర్టు సుశీల్ కుమార్పై మర్డర్, క్రిమినల్ కాన్స్పిరసీ, ఆర్మ్స్ యాక్ట్ విభాగాల కింద ఛార్జెస్ ఫ్రేమ్ చేసింది. స్టేడియానికి కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన తర్వాత సాగర్ ధన్కర్పై బేస్బాల్, హాకీ స్టిక్స్తో సుశీల్ కుమార్ అండ్ టీమ్ తీవ్రంగా దాడి చేసినట్లు దర్యాప్తులో తేలింది. కేసు విచారణ తుది దశకు చేరిన నేపథ్యంలో బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.
