Asia Cup 2025: UAE లో జరుగుతున్న ఆసియా కప్ 2025లో, భారతీయ జట్టు చాలా మంచి ప్రదర్శన ఇచ్చి ఫైనల్ కి వెళ్ళింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో, టీమ్ ఇండియా 5 మ్యాచ్లు గెలిచి సూపర్-4 రౌండ్లో అధిపత్యం చూపి, సెప్టెంబర్ 28న ఫైనల్ ఆడటానికి సిద్ధంగా ఉంది. ఇది ఇండియా ఆసియా కప్లో 12వ ఫైనల్.
టీమిండియా జైత్రయాత్ర
ఈ టోర్నమెంట్లో ఇండియా చాలా బాగా ఆడింది. గ్రూప్ స్టేజ్, సూపర్-4 రౌండ్లో టీమ్ ప్రతి మ్యాచ్లో తన శక్తి చూపించింది. ఫైనల్లో ఇండియాకి పాకిస్థాన్తో సమరం ఉండవచ్చు. ఇండియా ఆసియా కప్ చరిత్రలో 11సార్లు ఫైనల్ ఆడింది, అందులో 8సార్లు గెలిచింది. 1984, 1988, 1995, 1999, 2010, 2016, 2018, 2023లో భారత ఛాంపియన్గా నిలిచింది.
అభిషేక్ శర్మ అద్భుతమైన ప్రదర్శన
ఈసారి ఇండియా కోసం యువ బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ అద్భుతంగా ఆడాడు. 5 ఇన్నింగ్స్లలో 248 పరుగులు చేశాడు. టోర్నమెంట్లో టాప్ స్కోరర్గా ఉన్నాడు. లెఫ్ట్ హ్యాండ్్ బ్యాట్స్మెన్, రెండు మ్యాచ్లలో అర్ధ శతకాలు కొట్టాడు, పాకిస్థాన్తో సూపర్-4లో 74 పరుగులు, బంగ్లాదేశ్తో 75 పరుగులు చేశాడు. అభిషేక్ దూకుడు బ్యాటింగ్ టీమ్ ఇండియాని ప్రతి మ్యాచ్ లో బలమైన స్థితిలో నిలబెట్టింది. అభిషేక్ రెండు సార్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు కూడా గెలిచాడు.
కుల్దీప్ యాదవ్ బౌలింగ్ మ్యాజిక్
భారత్ గెలుపులో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సహకారం కూడా ముఖ్యమైంది. అయన ఈ టోర్నీలో 12 వికెట్లు తీశాడు. బంగ్లాదేశ్తో మ్యాచ్లో, రెండు బంతులకు రెండు వికెట్లు తీసి, ప్రతిపక్ష జట్టుని డిఫెన్స్లో పడేశాడు. అయన బౌలింగ్లో ఇండియా టీమ్కి చాల సార్లు ముఖ్యమైన విజయాలు అందిచింది.
సూపర్ 4లో చివరి మ్యాచ్ శ్రీలంకతో
భారత్ ఇప్పుడు సెప్టెంబర్ 26న సూపర్-4లో ఆఖరి మ్యాచ్ శ్రీలంకతో ఆడుతుంది. ఇప్పటికే శ్రీలంక ఫైనల్ రేసు నుంచి తప్పుకుంది. కానీ ఈ మ్యాచ్ ఇండియాకి ఫైనల్ ముందు సన్నాహకంగా ఉపయోగపడనుంది. ఈ పెర్ఫార్మెన్స్తో ఇండియా ఫైనల్లో టైటిల్ని కాపాడుకోడానికి సిద్ధంగా ఉంది.సెప్టెంబరు 28న ఫైనల్లో పాకిస్థాన్ లేదా బంగ్లాదేశ్తో ఏదో ఒక జట్టుతో ఆడనుంది.
బంగ్లాదేశ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో పాకిస్థాన్తో తలపడనుంది. ప్రస్తుతానికి, ఆసియా కప్ సూపర్ 4 పట్టికలో పాకిస్తాన్ బంగ్లాదేశ్ కంటే ముందంజలో ఉంది, కానీ రెండు జట్లు 4 పాయింట్లతో ఉన్నాయి. నికర రన్ రేట్ మాత్రం వేరుగా ఉంది. బంగ్లాదేశ్ను పాకిస్తాన్ ఓడిస్తే, ఆసియా కప్ 2025లో భారతదేశం vs పాకిస్తాన్ మ్యాచ్ను చూసే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం దుబాయ్లో నాల్గోసారి మ్యాచ్ను చూసే అవకాశం ఉంటుంది . గాయం కారణంగా భారత్తో జరిగిన మ్యాచ్కు దూరంగా ఉండాల్సి వచ్చినందున, పాకిస్తాన్ కెప్టెన్ లిట్టన్ దాస్ రంగంలోకి దిగుతాడా అనేది కూడా ఆసక్తికరంగా ఉంటుంది.
భారత బలాలు, ఫైనల్పై ఆశలు
ఈ టోర్నమెంట్లో భారతదేశం యొక్క ఫామ్ ప్రశంసనీయం. ఐదు విజయాలతో, భారతదేశం అజేయంగా నిలిచింది. బంగ్లాదేశ్ను ఓడించి ఫైనల్కు చేరుకుంది. పాకిస్తాన్ కూడా ఈ సీజన్లో భారతదేశం చేతిలో రెండుసార్లు ఓడిపోయింది. అందువల్ల, పాకిస్తాన్ లేదా బంగ్లాదేశ్ ఫైనల్కు చేరుకున్నా, భారత జట్టు విజయానికి మంచి అవకాశం ఉందని భావిస్తారు.