T20 WC 2022, Semi-final: కీలకమైన మ్యాచులో పాకిస్థాన్ ఓపెనర్లు విజృంభించారు. న్యూజిలాండ్ తో జరుగుతున్న సెమీస్ లో పాక్ ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్- బాబర్ అజాం జంట శతక భాగస్వామ్యం అందించారు. 


టీ20 ప్రపంచకప్ లో సూపర్ 12 దశలో తడబడిన పాకిస్థాన్ ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్, బాబర్ అజాంలు సరైన సమయంలో ఫాంలోకి వచ్చారు. కీలకమైన నాకౌట్ మ్యాచులో మొదటి వికెట్ కు శతక భాగస్వామ్యం అందించారు. న్యూజిలాండ్ నిర్దేశించిన 153 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాక్ ఓపెనింగ్ జోడీ తొలి వికెట్ కు 12.4 ఓవర్లలోనే 105 పరుగుల భాగస్వామ్యం నిర్మించి బలమైన పునాది వేశారు. దాంతో ఎలాంటి టెన్షన్ లేకుండా ఆ జట్టు విజయం సాధించి ఫైనల్ కి చేరుకుంది.