Shreyas Iyer Unwanted Captaincy Record After England Defeat: ఇండియా నయా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ కెరీర్ అత్యంత వరస్ట్ నోట్ తో స్టార్ట్ అయింది. అతని లీడర్షిప్ లో ఆడిన ఫస్ట్ మ్యాచ్ లో ఇండియా 34 రన్స్ తేడాతో ఐర్లాండ్ చేతిలో ఓడిపోయింది. అది ఏదో ఒక మ్యాచ్ లో జరిగిన పొరపాటు అనుకుంటే, రెండో మ్యాచ్ లోనూ ఐర్లాండ్ ఒక్క రన్ తేడాతో ఇండియాను ఓడించి అయ్యర్ సేనను 2-0 తో క్లీన్ స్వీప్ చేసి హిస్టారికల్ షాక్ ఇచ్చింది. ఆ తర్వాత ఇంగ్లాండ్తో జరగాల్సిన ఫస్ట్ టీ20 మ్యాచ్ వర్షం వల్ల కంప్లీట్గా వాషౌట్ అయింది. శనివారం జరిగిన సెండ్ టీ20 మ్యాచ్ లోనైనా ఫస్ట్ విక్టరీ కొట్టాలని అయ్యర్ చూసినప్పటికీ ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో ఇండియాను దారుణంగా దెబ్బకొట్టింది. ఈ ఓటమితో అయ్యర్ పేరిట ఒక అన్వాంటెడ్ వరస్ట్ రికార్డ్ నమోదైంది. ఇండియా తరఫున మూడు కంప్లీట్ మ్యాచులకు కెప్టెన్సీ చేసి ఒక్కటంటే ఒక్క మ్యాచ్ లోనూ విక్టరీ సాధించలేకపోయిన ఫస్ట్ ఇండియన్ కెప్టెన్ గా అయ్యర్ హిస్టరీ క్రియేట్ చేశాడు.
రవి బిష్ణోయ్ బ్లండర్ షోఈ మ్యాచ్ 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ మచ్-హైప్డ్ ఇంటర్నేషనల్ డెబ్యూతో ఎంతో గ్రాండ్ గా స్టార్ట్ అయింది. కానీ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ తన వరస్ట్ బౌలింగ్ తో పండగ వాతావరణాన్ని కంప్లీట్గా పాడుచేశాడు. మ్యాచ్ లో బిష్ణోయ్ వేసిన 17వ ఓవర్ లో ఏకంగా 29 రన్స్ సమర్పించుకుని మ్యాచ్ ను ఇంగ్లాండ్ చేతుల్లో పెట్టాడు. ఆ ఓవర్ ఫస్ట్ రెండు బంతులనూ బిష్ణోయ్ నో బాల్స్ వేసి భారీ బ్లండర్ చేశాడు. టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ ఓటమికి పగ తీర్చుకోవాలని చూస్తున్న ఇంగ్లాండ్ 22 ఏళ్ల యంగ్ ఆల్రౌండర్ జాకబ్ బెథెల్ (46 బంతుల్లో 76 నాటౌట్) ఈ లక్కీ ఛాన్స్ ను పక్కాగా యూజ్ చేసుకుని మూడు భారీ సిక్సర్లు బాదాడు. దీంతో 191 రన్స్ ఛేజింగ్ను ఇంగ్లాండ్ మరో ఓవర్ మిగిలి ఉండగానే చాలా ఈజీగా ఫినిష్ చేసి సిరీస్ లో 1-0 లీడ్ సాధించింది.
అర్ష్దీప్ సింగ్ పై హ్యారీ బ్రూక్ అటాక్.. నిజానికి ఇంగ్లాండ్ ఛేజింగ్ చాలా దారుణంగా స్టార్ట్ అయింది. ఇండియా స్పీడ్స్టర్ అర్ష్దీప్ సింగ్ ఫస్ట్ ఓవర్ లోనే ఓపెనర్లు ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ లను అవుట్ చేసి ఇండియాకు అదిరిపోయే బ్రేక్ త్రూ ఇచ్చాడు. కానీ ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. క్రీజులోకి వచ్చిన ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ కేవలం 15 బంతుల్లోనే 3 సిక్సర్లు, 2 ఫోర్లతో 39 రన్స్ చేసి అర్ష్దీప్ సింగ్ ఓవర్ లోనే 27 రన్స్ పిండుకుని కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశాడు. అక్షర్ పటేల్ బౌలింగ్ లో బ్రూక్ లెగ్ సైడ్ లో ఇషాన్ కిషన్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయినప్పటికీ, అప్పటికే అతను ఇంగ్లాండ్ విక్టరీకి కావలసిన సాలిడ్ ఫౌండేషన్ (పునాది) సెట్ చేశాడు.
అక్షర్ పటేల్ ఒక్కడే వన్ మ్యాన్ షోఆ తర్వాత బెథెల్ తో జాయిన్ అయిన టామ్ బాంటన్ (32 బంతుల్లో 39 రన్స్) ఫోర్త్ వికెట్ కు ఏకంగా 67 రన్స్ క్రూషియల్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. ఈ ఇద్దరూ ఇండియన్ స్పిన్నర్లను చాలా ఈజీగా హ్యాండిల్ చేశారు. ఇంగ్లాండ్ స్పిన్నర్లతో పోలిస్తే ఇండియా మెయిన్ స్పిన్నర్లు రవి బిష్ణోయ్ (4 ఓవర్లలో 0/60), వరుణ్ చక్రవర్తి (4 ఓవర్లలో 1/37) లు పిచ్ నుంచి ఎలాంటి సపోర్ట్ రాబట్టలేకపోయారు. ఇంగ్లీష్ స్పిన్నర్లు బాల్ ను గాల్లో స్లోగా వేసి వికెట్లు తీస్తే, మనవాళ్లు మాత్రం ధారాళంగా రన్స్ సమర్పించుకున్నారు. ఇండియా బౌలింగ్ లో కేవలం అక్షర్ పటేల్ (4 ఓవర్లలో 1/19) ఒక్కడే ఎకనామికల్ గా బౌలింగ్ చేసి వన్ మ్యాన్ షో చూపించినా లాభం లేకపోయింది. ఇక మంగళవారం జరిగే మూడో టీ20లోనైనా గెలిచి, సిరీస్ సమం చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. లేకపోతే సిరీస్ గెలిచే అవకాశం కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు.
