2024 Ranji Trophy: రంజీ ట్రోఫీ 2024 సీజన్‌లో పరుగుల వరద పారుతుంది. సీనియర్‌ బ్యాటర్లు, టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లు, యువ క్రికెటర్లు చెలరేగిపోతున్నారు. పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కర్ణాటక ఆటగాళ్లు సైతం రెచ్చిపోయారు. కర్ణాటక బ్యాటర్‌ దేవదత్‌ పడిక్కల్‌ భారీ శతకంతో చెలరేగాడు. కేవలం 216 బంతుల్లో 24 ఫోర్లు, 4 సిక్సర్లతో 193 పరుగులు చేసి సత్తా చాటాడు. మనీశ్‌ పాండే సైతం మెరుపు శతకంతో టీమిండియా తలుపు తట్టాడు. కేవలం 165 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో మనీశ్‌ పాండే 118 పరుగులు చేశాడు. మరో యువ బ్యాటర్‌ శ్రీనివాస్‌ శరత్‌ కూడా 76 పరుగులతో రాణించడంతో కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 514 పరుగుల వత్తా ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. ఈ మ్యాచ్‌లో కర్ణాటక కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ డకౌట్‌ కాగా.. ఓపెనర్‌ ఆర్‌ సమర్థ్‌ 38 త్వరగానే అవుటయ్యాడు. పంజాబ్‌ బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌ 3 వికెట్లు పడగొట్టగా.. ప్రేరిత్‌ దత్‌, నమన్‌ ధిర్‌ తలో 2 వికెట్లు, సిదార్థ్‌ కౌల్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన పంజాబ్‌ సైతం పరుగుల వరద పారిస్తుంది. ఓపెనర్లు అభిషేక్‌ శర్మ (85), ప్రభసిమ్రన్‌ సింగ్‌ (83) శతకాల దిశగా సాగుతున్నారు. మూడో రోజు టీ విరామం సమయానికి పంజాబ్‌ ఒక్కవికెట్‌ కూడా నష్టపోకుండా 169 పరుగులు చేసి ధీటుగా స్పందిస్తోంది.


పుజరా ద్వి శతకం
స్పెష‌లిస్ట్ టెస్ట్‌ బ్యాటర్ అయిన పూజారా 243 ర‌న్స్‌తో విరుచుకుప‌డ్డాడు. ప్రపంచ టెస్టు చాంపియ‌న్‌షిప్ వైఫ‌ల్యంతో జ‌ట్టుకు దూర‌మైన నయావాల్ ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లో 17వ ద్విశ‌త‌కం న‌మోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల‌ సిరీస్‌కు తాను సిద్దంగా ఉన్నానంటూ సెలెక్ట‌ర్లుకు సందేశాలు పంపాడు. జార్ఘండ్ బౌల‌ర్లను ఉతికారేస్తూ 356 బంతుల్లో డ‌బుల్ సెంచ‌రీ బాది జ‌ట్టుకు భారీ స్కోర్ అందించాడు. మరో సౌరాష్ట్ర ఆటగాడు ప్రేర‌క్ మ‌న్కడ్ కూడా శతకం చేయడంతో సౌరాష్ట్ర 5784 వ‌ద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. నయావాల్ Pujara ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లో 17వ ద్విశ‌త‌కం న‌మోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల‌ సిరీస్‌కు తాను సిద్దంగా ఉన్నానంటూ సెలెక్టర్లుకు సందేశాలు పంపాడు. జార్ఘండ్ బౌల‌ర్లను ఉతికారేస్తూ 356 బంతుల్లో డ‌బుల్ సెంచ‌రీ బాది జ‌ట్టుకు భారీ స్కోర్ అందించాడు. దేశవాళీ క్రికెట్‌లో సౌరాష్ట్రకు ప్రాతినిథ్యం వహిస్తున్న పుజారా.. తొలి మ్యాచ్‌లోనే ద్వి శతకం చేయడం విశేషం. ఈ డబుల్‌ సెంచరీతో చెలరేగిన పుజారా అరుదైన ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు.


పుజారా రికార్డులు
ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అత్యధిక డబుల్‌ సెంచరీలు చేసిన నాలుగో ఆటగాడిగా పుజారా నిలిచాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా లెజెండ్‌ సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ (Don Bradman) 37 డబుల్ సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా పుజారా 19, 730 రన్స్‌తో రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్‌ లక్ష్మణ్‌ 19,729ను పుజారా అధిగమించాడు.