Messi 2025 Tour: భారత్లో G.O.A.T టూర్ 2025 పేరుతో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు పర్యటించాడు. కోల్కతా ప్రారంభమైన ఆయన టూర్ ఢిల్లీలో ముగిసింది. ముగింపు రోజున అతన్ని ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, ఐసీసీ ఛైర్మన్ జైషా సమావేశమయ్యారు. వచ్చే ఏడాది జరిగే టీ 20 వరల్డ్ కప్ క్రికెట్కు ఆహ్వానించారు.
అరుణ్ జైట్లీ స్టేడియంలో మెస్సీని ICC ఛైర్మన్ జైషా కలిశారు. వచ్చే ఏడాది భారత్, శ్రీలంకలో టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఆ టోర్నమెంట్లో భారత్-అమెరికా మ్యాచ్ చూడటానికి మెస్సీని ఆహ్వానించి టికెట్లను బహుమతిగా ఇచ్చారు. మెస్సీతో పాటు భారత్ పర్యటనకు వచ్చిన రోడ్రిగో డి పాల్, లూయిస్ సువారెజ్ కూడా ఉన్నారు. వేదికపై ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రోహన్ జైట్లీ కూడా ఉన్నారు. ఫిబ్రవరి 7న భారత్, అమెరికా మధ్య జరిగే మ్యాచ్ కోసం జై షా మెస్సీకి టికెట్లు అందజేశారు.
లియోనెల్ మెస్సీ భారత పర్యటన నిన్నటితోనే ముగియాల్సి ఉంది. అయితే, పొగమంచు కారణంగా, షెడ్యూల్లో మార్పులు జరిగాయి. ఆలస్యంగా రాజధాని న్యూఢిల్లీలో అడుగుపెట్టాడు. అతను అక్కడి నుంచి ఇంటికి తిరిగి వెళ్లాల్సి ఉంది. కానీ అది జరగలేదు. అయితే, మెస్సీ తన షెడ్యూల్ను మార్చుకుని నిన్న జామ్నగర్ చేరుకున్నాడు. అక్కడే నిన్న ఉండిపోయాడు. ఇవాళ ఢిల్లీ వచ్చి స్వదేశానికి పయనమయ్యాడు.
మెస్సీ, రోడ్రిగో డి పాల్, లూయిస్ సువారెజ్ లు న్యూఢిల్లీ నుంచి దేశానికి బయలుదేరాల్సి ఉన్నప్పటికీ, వారిని జామ్ నగర్ లోని వంతారా వన్యప్రాణుల అభయారణ్యంలోకి ఆహ్వానించారు. వారు నిన్న న్యూఢిల్లీ నుంచి అక్కడికి విమానంలో వెళ్లారు. అనంత్ అంబానీ రాత్రి వారికి ఆతిథ్యం ఇచ్చారు. ఒక రాత్రి అక్కడ బస చేసిన తర్వాత, అర్జెంటీనా లెజెండ్, సువారెజ్ చివరకు ఈరోజు విమానం ఎక్కి వెళ్లిపోయారు.
న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో, మెస్సీ చాలా నవ్వుతూ కనిపించాడు. ఫుట్బాల్ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడు భారతదేశాన్ని ప్రశంసలతో నింపాడు. భారత ఫుట్బాల్ అభిమానులు. అర్జెంటీనా ప్రపంచ కప్ విజేత కెప్టెన్ మూడు రోజుల్లో నాలుగు నగరాలను సందర్శించాడు. పర్యటన కోల్కతా నుంచి ప్రారంభమైంది. తరువాత హైదరాబాద్, ముంబై, ఢిల్లీ. మెస్సీ మళ్ళీ భారతదేశానికి వస్తానని ప్రకటించాడు.
"గత కొన్ని రోజులుగా భారతదేశంలో నాకు లభించిన ప్రేమకు ధన్యవాదాలు. మాకు గొప్ప, ప్రత్యేకమైన అనుభవం లభించింది. మాకు చాలా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ, చాలా తక్కువ సమయంలోనే, ఇంత ప్రేమ లభించడం చాలా బాగుంది. ఇక్కడ అందరూ నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో నాకు తెలుసు. కానీ నేనే వచ్చి అది చూశాను. ఇదంతా కలలా ఉంది." అని సోమవారం రాజధాని న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో ప్రసంగిస్తూ లియోనెల్ మెస్సీ చెప్పాడు.
మెస్సీ చిన్నపిల్లల్లా సంతోషంగా గడిపాడు. అతని ముఖంలో చిరాకు జాడలు లేవు. మెస్సీ మైదానంలో పిల్లలతో ఫుట్బాల్ ఆడాడు . తర్వాత స్పానిష్లో జనంతో ఇలా అన్నాడు, 'గత కొన్ని రోజులుగా మీరు మాపై చూపించిన ప్రేమను నమ్మలేకపోతున్నాం. నాకు చాలా క్రేజీగా అనిపించింది. ఈ ప్రేమకు ధన్యవాదాలు. మేము ఖచ్చితంగా ఏదో ఒక రోజు తిరిగి వస్తాము. బహుశా మ్యాచ్ ఆడటానికి లేదా మరేదైనా సందర్భం కోసం. కానీ నేను మళ్ళీ వస్తాను. మీ అందరికీ ధన్యవాదాలు, చాలా ధన్యవాదాలు.'