Ireland Secures Historic T20I Victory Over India: వ‌రుస‌గా రెండుసార్లు ప్ర‌పంచ‌క‌ప్ సాధించిన భార‌త టీ20 జ‌ట్టును ఐర్లాండ్ నేల‌కు దించింది. తొలిసారి టీమిండియా ఒక ఫార్మాట్ లో విజ‌యం సాధించి, చ‌రిత్ర‌కెక్కింది. బెల్ఫాస్ట్‌లోని సివిల్ సర్వీస్ క్రికెట్ క్లబ్ మైదానంలో శుక్రవారం జరిగిన ఫస్ట్ టీ20 మ్యాచ్ లో ఇండియాకు గట్టి షాక్ తగిలింది. టూ-మ్యాచ్ సిరీస్‌లో భాగంగా జరిగిన ఈ పోరులో ఐర్లాండ్ టీమ్ 34 రన్స్ తేడాతో ఇండియాను చిత్తు చేసింది. క్రికెట్ లోని ఏ ఫార్మాట్‌లోనైనా ఇండియాపై ఐరిష్ టీమ్‌కు ఇదే ఫస్ట్ విక్టరీ కావడం విశేషం. టాస్ గెలిచిన ఇండియన్ కెప్టెన్ ఫస్ట్ బౌలింగ్ ఎంచుకోగా, ఐర్లాండ్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 రన్స్ సాలిడ్ స్కోర్ బోర్డ్ పై పెట్టింది. లోర్కాన్ ట‌క‌ర్ (36 బంతుల్లో 50, 5 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) తో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. బౌల‌ర్ల‌లో హ‌ర్షిత్ రాణాకు మూడు వికెట్లు ద‌క్కాయి.  ఆ తర్వాత ఛేజింగ్‌లో టీమిండియా 18.5 ఓవర్లలో కేవలం 148 రన్స్ కే కంప్లీట్‌గా ఆలౌట్ అయింది. ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ  (20 బంతుల్లో 49, 7 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) తో టాప్ స్కోర‌ర్ గా నిలిచి, ఒంట‌రి పోరాటం చేశాడు. బౌల‌ర్ల‌లో మ‌థ్యూ హంప్రెస్, మాట్ హోలార్డ్ త‌లో మూడు వికెట్ల‌తో స‌త్తా చాటారు.

Continues below advertisement

Continues below advertisement

హర్షిత్ రాణా సూపర్ బౌలింగ్.. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ టీమ్‌ను కంట్రోల్ చేయడంలో ఇండియా యంగ్ పేసర్ హర్షిత్ రాణా అద్భుతంగా రాణించాడు. తను 4 ఓవర్లలో కేవలం 24 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి ఇంప్రెస్ చేశాడు. అయితే మరో ఎండ్ లో సీనియర్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. ప్రసిద్ధ్ తన 4 ఓవర్ల కోటాలో ఒక్క వికెట్ కూడా తీయకుండా ఏకంగా 57 రన్స్ సమర్పించుకున్నాడు. ఐరిష్ కెప్టెన్ సూప‌ర్భ్ ఇన్నింగ్స్ ఆడుతూ 36 బంతుల్లో 50 రన్స్ తో హాఫ్ సెంచరీ చేయగా, గారెత్ డెలానీ లాస్ట్ లో 32 బంతుల్లో 49 రన్స్ చేసి టీమ్‌కు క్రూషియల్ ఫినిషింగ్ ఇచ్చాడు. కాగా ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేసిన 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీకి ఈ మ్యాచ్ ప్లేయింగ్ ఎలెవన్ లో ప్లేస్ దక్కలేదు.

Read Also: Record Breaker Shree Charani: రికార్డుల రారాణి శ్రీ చరణి.. పూనమ్ యాదవ్  రికార్డు బ‌ద్ద‌లు, టోర్నీలో స‌రికొత్త హిస్ట‌రీ క్రియెట్ చేసిన తెలుగు తేజం!

అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ మిస్.. 183 రన్స్ బిగ్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఇండియాకు ఓపెనర్ అభిషేక్ శర్మ అదిరిపోయే స్టార్ట్ ఇచ్చాడు. అభిషేక్ కేవలం 20 బంతుల్లోనే ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతూ 49 రన్స్ తో త్రుటిల్ ఫిఫ్టీ మిస్ చేసుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు అతనికి వేరే బ్యాటర్ల నుంచి ఎలాంటి సపోర్ట్ దక్కలేదు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ఐరిష్ బౌలర్ల లైన్ అండ్ లెంగ్త్‌ను తట్టుకోలేక క్రీజులోకి వచ్చినట్లే వచ్చి పెవిలియన్ క్యూ కట్టారు. అభిషేక్ అవుట్ అయిన తర్వాత ఇండియా రన్ రేట్ కంప్లీట్‌గా పడిపోయింది. ఐర్లాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ ఇండియన్ బ్యాటర్లను వరుసగా అవుట్ చేశారు. హోలార్డ్ కు ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ద‌క్కింది.

సిరీస్ క్లీన్ స్వీప్ పై ఐర్లాండ్ కన్నుఈ చారిత్రాత్మక విజయం తర్వాత ఐర్లాండ్ క్యాంప్ లో సెలెబ్రేషన్స్ అంబరాన్ని తాకాయి. ఇండియా లాంటి పవర్‌ఫుల్ టీమ్‌ను ఓడించడం తమ క్రికెట్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ మూమెంట్ అని ఐరిష్ కెప్టెన్ గర్వంగా స్పష్టం చేశాడు. ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ లో కన్సిస్టెన్సీ లోపించిందని, పార్ట్‌నర్‌షిప్స్ బిల్డ్ చేయడంలో ఫెయిల్ అవ్వడం వల్లే ఈ ఘోర పరాజయం ఎదురైంది. ఈ ఓటమితో ఇండియా సిరీస్ లో 0-1 తో వెనుకబడగా, నెక్స్ట్ మ్యాచ్ లో గెలిస్తేనే సిరీస్ సమం అవుతుంది. ఐర్లాండ్ మాత్రం సెండ్ మ్యాచ్ లోనూ గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలనే పక్కా ప్లాన్ తో ఉంది. ఇరుజ‌ట్ల మ‌ధ్య ఆఖరిదైన రెండో మ్యాచ్ ఈనెల 28న ఇదే వేదిక‌పై జ‌రుగుతుంది.