దుబాయ్‌ వేదికగా భారత్, పాకిస్థాన్ మధ్య 2025 అండర్-19 ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్, భారత్‌కు 348 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఒక దశలో పాకిస్థాన్ స్కోరు 43 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 300 దాటింది. కానీ చివరి ఓవర్లలో భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి, పాకిస్థాన్‌ను 350 లోపు కట్టడి చేశారు. పాకిస్థాన్ ఓపెనర్ సమీర్ మిన్హాస్ 113 బంతుల్లో 172 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. అతని బ్యాట్ నుండి 17 ఫోర్లు, 9 సిక్సులు వచ్చాయి. భారత్ తరపున దీపేష్ దేవేంద్రన్ అత్యధికంగా 3 వికెట్లు తీశాడు. 

Continues below advertisement

భారత్ టైటిల్ గెలవాలంటే అండర్-19 ఆసియా కప్ చరిత్రలో ఫైనల్ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు ఛేదించాల్సి ఉంటుంది. అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్ అత్యధిక స్కోరు సాధించింది. పాకిస్థాన్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. ఇప్పుడు భారత జట్టుకు వైభవ్ సూర్యవంశీ, కెప్టెన్ ఆయుష్ మ్హత్రేల నుండి భారీ అంచనాలున్నాయి. 

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన అండర్-19 పాకిస్థాన్ జట్టు వేగంగా పరుగులు రాబట్టింది. 50 ఓవర్ల మ్యాచ్‌లో 3 ఓవర్లలోనే స్కోరు 30 దాటింది. నాలుగో ఓవర్‌లో తొలి వికెట్ పడింది. హమ్జా జహూర్ 14 బంతుల్లో 18 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడు 2 సిక్సులు, ఒక ఫోర్ కొట్టాడు. మూడోొ స్థానంలో వచ్చిన ఉస్మాన్ ఖాన్ 45 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 35 పరుగులు చేశాడు. 

Continues below advertisement

ఒకవైపు సమీర్ మిన్హాస్ వేగంగా పరుగులు చేశాడు. మరోవైపు జాగ్రత్తగా బ్యాటింగ్ జరుగుతోంది. నాలుగు స్థానంలో వచ్చిన అహ్మద్ హుస్సేన్ 72 బంతుల్లో 56 పరుగులతో అర్ధశతకం సాధించాడు. అయితే, సమీర్ మిన్హాస్ స్వేచ్ఛగా ఆడాడు. సమీర్ 113 బంతుల్లో 17 ఫోర్లు, 9 సిక్సర్ల సహాయంతో 172 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ ఫర్హాన్ యూసుఫ్ 18 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 19 పరుగులు చేశాడు.. 

సమీర్ మిన్హాస్ ఔటైన వెంటనే పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌గా వరుసగా క్యూ కట్టారు. చివరి 7 ఓవర్లలో భారత బౌలర్లు కేవలం 45 పరుగులు మాత్రమే ఇచ్చారు. లేకపోతే పరిస్థితి మరోలా ఉండేది. భారత్ తరపున దీపేష్ దేవేంద్రన్ 10 ఓవర్లలో 83 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఖిలన్ పటేల్ 10 ఓవర్లలో కేవలం 44 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. హేనల్ పటేల్‌ సైతం రెండు వికెట్లు పడగొట్టాడు.