India Predected Playing XI Against Zimbabwe: ఇంగ్లాండ్ టూర్ లో వరుసగా త్రీ మ్యాచ్ లలో ఫెయిల్యూర్స్ తర్వాత డ్రాప్ అయిన యంగ్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ, గురువారం జింబాబ్వేతో జరగబోయే ఫస్ట్ టి20 మ్యాచ్ లో ఇండియా ప్లేయింగ్ ఎలెవన్ లో ప్లేస్ సాధించడం కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు. లాస్ట్ 7 టి20 మ్యాచ్ లలో కంటిన్యూగా ఒక్క విక్టరీ కూడా లేని ఇండియాను మళ్లీ విన్నింగ్ ట్రాక్ లోకి తెచ్చేందుకు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా ట్రై చేస్తున్నాడు. సిరీస్ ఓపెనర్ మ్యాచ్ కోసం ఇండియా ప్లేయింగ్ 11 సెలెక్షన్ లో కొన్ని టఫ్ డెసిషన్స్ తీసుకోక తప్పడం లేదు. మెయిన్ గా ఓపెనింగ్ డిపార్ట్‌మెంట్ లో అభిషేక్ శర్మ పక్కాగా బరిలోకి దిగుతుండగా, సెకండ్ ఓపెనర్ స్పాట్ కోసం వైభవ్ సూర్యవంశీ, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ల మధ్య హెవీ కాంపిటీషన్ నడుస్తోంది.

Continues below advertisement

Read Also: Hitman Slap Response: విమర్శకుల నోళ్లు మూయించిన రోహిత్  సెంచరీ.. 'చెంపపెట్టు'గా అభివర్ణించిన రవిశాస్త్రి,  ది హండ్రెడ్ లీగ్ లో హిట్‌మ్యాన్ సందడి!

ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ఆప్షన్.. ఐపీఎల్ కనెక్షన్ తో శ్రేయస్ అయ్యర్ ప్లాన్స్ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ కు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా ఉన్నాడు, అదే టీమ్ లో ప్రభ్‌సిమ్రాన్ సింగ్ కూడా ఉండటం వల్ల అతనికే చాన్స్ దక్కుతుందేమో అనే టాక్ నడుస్తోంది. లాంగ్ టైమ్ నుంచి డోర్ నాక్ చేస్తున్న ప్రభ్‌సిమ్రాన్ ను అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ కు పంపించే ఆలోచన కెప్టెన్ కి ఉండే స్కోప్ ఉన్నప్పటికీ, దానికి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. ప్రెజెంట్ పొజిషన్ ప్రకారం అభిషేక్, వైభవ్ సూర్యవంశీలే ఓపెనర్లుగా వచ్చే ఛాన్స్ ఉంది. గ‌త అండ‌ర్-1 వ‌రల్డ్ క‌ప్ ఫైన‌ల్లో అద‌ర‌గొట్టిన హ‌రారే స్టేడియంలో మ‌రోసారి స‌త్తా చాటాల‌ని వైభ‌వ్ భావిస్తున్నాడు. నంబర్ 3 లో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్, నంబర్ 4 లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ కు రానున్నాడు.

Continues below advertisement

Read Also: Sachin Advice To Harbhajan : సచిన్  చెప్పిన ఆ ఒక్క గోల్డెన్ వర్డ్.. నా లైఫ్ ను టర్న్ చేసింది.. మాజీ స్టార్ స్పిన్నర్ సంచలన వ్యాఖ్యలు 

ఫినిషర్ల రోల్ లో ఫైరింగ్ స్టార్స్.. పేస్ స్పిన్ విభాగంలో నయా కాంబినేషన్ఫినిషర్లుగా నంబర్ 5 లో తిలక్ వర్మ, నంబర్ 6 లో శివమ్ దూబే, నంబర్ 7 లో రింకూ సింగ్ బరిలోకి దిగనున్నారు. వీరిలో కనీసం ఒకరైనా మ్యాచ్ ఎండ్ వరకు ఉండి భారీ స్కోరు సాధించాల్సి ఉంటుంది. స్పిన్ డిపార్ట్‌మెంట్ లో హర్ష్ దూబే, రవి బిష్ణోయ్ ల మధ్య పోటీ ఉన్నప్పటికీ, ఫస్ట్ మ్యాచ్ కు హర్ష్ దూబేకే ప్రాధాన్యత దక్కే ఛాన్స్ ఉంది. పేస్ బౌలింగ్ లో అశోక్ శర్మ, యశ్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్ లు ట్రియో గా రానుండగా, మయాంక్ యాదవ్ ఆప్షన్ కూడా అవైలబుల్ గా ఉంది.

ఫస్ట్ టి20 కోసం ఇండియా ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ ఎలెవన్:అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, రింకూ సింగ్, హర్ష్ దూబే, అశోక్ శర్మ, యశ్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్ లు ఫస్ట్ టి20 లో ఆడే అవకాశం ఉందని తెలుస్తోంది.