జింబాబ్వేతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్‌ను సొంతం చేసుకున్నట్లే. హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో ఈ మ్యాచ్ జరగనుంది.


తుదిజట్టులో భారత్ ఒక్క మార్పు మాత్రమే చేసింది. గత మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసుకుని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన దీపక్ చాహర్ ఈ మ్యాచ్‌కు దూరం అయ్యాడు. తన స్థానంలో శార్దూల్ ఠాకూర్‌కు స్థానం లభించింది.


మరోవైపు జింబాబ్వే కూడా తుదిజట్టులో రెండు మార్పులు చేసింది. తదివానషే మరుమని, రిచర్డ్ ఎంగార్వా స్థానాల్లో తకుడ్జ్‌వానషే కైటానో, టణక చివంగా జట్టులోకి వచ్చారు. గురువారం జరిగిన మొదటి మ్యాచ్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.


టీమిండియా తుదిజట్టు
శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), దీపక్ హుడా, సంజు శామ్సన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్, ప్రసీద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్


జింబాబ్వే తుదిజట్టు
తకుడ్జ్‌వానషే కైటానో, ఇన్నోసెంట్ కయా, షాన్ విలియమ్స్, వెస్లీ మదెవెరె, సికిందర్ రాజా, రెగిస్ చకాబ్వా (కెప్టెన్, వికెట్ కీపర్), ర్యాన్ బుర్ల్, లూక్ జాంగ్వే, బ్రాడ్ ఎవాన్స్, విక్టర్ న్యావుచి, టణక చివంగా